కరోనా నుంచి విముక్తి పొందిన న్యూజీలాండ్
By: Sankar Fri, 29 May 2020 7:55 PM
ప్రపంచం మొత్తం కరోనా మహమ్మారితో పోరాడుతుంటే ..న్యూజిలాండ్ మాత్రం తమ దేశం లో చివరి కరోనా పేషెంట్ డిశ్చార్జ్ అయినట్లు ప్రకటించింది..కరోనా నుంచి కోలుకున్న చివరి బాధితుడిని ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ చేసినట్లు వెల్లడించింది. కాగా న్యూజిలాండ్ దేశంలో గత వారం రోజులుగా ఒక్క కరోనా కేసు కూడా నమోదు కాలేదని అక్కడి అధికారులు వెల్లడించారు. ఈ క్రమంలో బుధవారం కరోనా బారి నుంచి బయటపడ్డ చిట్టచివరి పేషెంట్ను ఆక్లండ్లోని మిడిల్మోర్ ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ చేశారు.
న్యూజిలాండ్ ప్రధాని అనుసరించిన విధివిధానాలు, ఆమె సమర్థవంతమైన నాయకత్వమే ప్రాణాంతక వైరస్తో సాగిన పోరాటంలో గెలుపుకు కారణమైందని ప్రజలు ఆమెకు జేజేలు పలుకుతున్నారు. కరోనా ఉనికి కనబడగానే లాక్డౌన్ విధించడం, ఎక్కువ సంఖ్యలో పరీక్షలు చేయడం ఈ గెలుపుకు దోహదపడ్డాయంటున్నారు. ఆ దేశంలో ఆరు కరోనా కేసులు నమోదవగానే దేశ ప్రజలందరూ రెండు వారాలపాటు సెల్ఫ్ ఐసోలేట్లో ఉండాలని ప్రధాని జెసిండా పిలుపునిచ్చారు. బాధితుల సంఖ్య 28కు చేరుకునే సమయానికి విదేశాల నుంచి రాకపోకలపై నిషేధం విధించారు. అంతేకాక దేశంలో 2,67,435 కరోనా పరీక్షలు నిర్వహించడం విశేషం. ఇప్పటివరకు అక్కడ 1504 కేసులు నమోదవగా 22 మంది చనిపోయారు, మిగతా అందరూ కోలుకున్నారు.
చైనా లో మొదలైన ఈ కరోనా మహమ్మారి ప్రపంచం లో ఉన్న అన్ని దేశాలను గడగడలాడించింది ..అమెరికా , ఇటలీ , ఇరాన్ ,స్పెయిన్ , చైనా వంటి దేశాల్లో ఎంతో మంది ప్రాణాలను కోల్పోయారు ..ఇండియా లో ఈ మహమ్మారి విజృంభించినప్పటికీ మరణాల రేట్ తక్కువగానే ఉంది ..ఇలాంటి తరుణం లో న్యూజీలాండ్ లో కరోనా పేషెంట్ల సంఖ్య జీరో కావడం శుభ పరిణామమే