తెలంగాణలో పెద్ద ఎత్తున కరోనా కేసులు...
By: chandrasekar Fri, 02 Oct 2020 6:08 PM
తెలంగాణలో గురువారం
మొత్తం 2009 కరోనా
కొత్త కేసులు నమోదైనట్లుగా హెల్త్ బులెటన్లో తెలిపారు. దీంతో రాష్ట్రంలో మొత్తం
కరోనా కేసుల సంఖ్య 1,95,609 కు చేరింది. ఇక ప్రస్తుతం రాష్ట్రంలో యాక్టివ్
కేసులు 28,620గా ఉన్నాయి. మరో 23,372 మంది హోం ఐసోలేషన్లో చికిత్స పొందుతున్నారు. గత 24
గంటల్లో 2,437 మంది
కోలుకొని డిశ్చార్జి అయ్యారు. ఇక గురువారం మరో 10 మంది కరోనాతో మరణించగా, మొత్తం
చనిపోయిన వారి సంఖ్య 1145కి చేరింది.
గురువారం నాడు గుర్తించిన
కరోనా కేసుల్లో జిల్లాల్లోనూ పెద్ద ఎత్తున కేసులను గుర్తించారు. ఒక్క జీహెచ్ఎంసీ
పరిధిలోనే అధికంగా 293 కొత్త కేసులు నమోదయ్యాయి. ఆ తర్వాత కేసుల తాకిడి
అత్యధికంగా మేడ్చల్ మల్కాజ్ గిరి జిల్లాలో ఉంది. ఇక్కడ 173 కొత్త
కేసులు గుర్తించారు. ఆ తర్వాతి స్థానంలో రంగారెడ్డి జిల్లా ఉంది. ఇక్కడ 171 కొత్త
కేసులు నమోదయ్యాయి.