లాలూప్రసాద్ యాదవ్ ఆరోగ్యం అంతగా బాగోలేదు: రిమ్స్
By: chandrasekar Tue, 10 Nov 2020 3:02 PM
రాష్ట్రీయ జనతాదళ్ పార్టీ
అధినేత లాలూప్రసాద్ యాదవ్ ఆరోగ్యం అంతగా బాగోలేదని రాంచీ ఇన్స్టిట్యూట్ ఆఫ్
మెడికల్ సైన్సెస్ పేర్కొంది. దాణా కుంభకోణం కేసులో జైలుశిక్ష అనుభవిస్తున్న
లాలూప్రసాద్ అనారోగ్యం కారణంగా గత కొన్నాళ్లుగా రిమ్స్లో చికిత్స
పొందుతున్నారు.
శరీరంలోని వివిధ అవయవాల
పనితీరు సరిగా లేకపోవడంతో రెండేళ్ల క్రితం అధికారులు ఆయనను రిమ్స్లో చేర్చారు.
లాలూకు మధుమేహం, అధిక రక్తపోటు ఉన్నాయి. బైపాస్ సర్జరీ కూడా చేశారు.
లాలూ యాదవ్ను రిమ్స్లో
చేర్చినప్పుడు ఆయన మూత్రపిండాల పనితీరు 50 శాతం కంటే తక్కువగా ఉంది. ఆ తర్వాత 40
శాతానికి పడిపోయింది. ప్రస్తుతం సుమారు 25 శాతం బేస్లైన్లో ఆయన మూత్రపిండాల పనితీరు ఉన్నదని
వైద్యులు పేర్కొన్నారు.
వైద్యపరంగా దీన్ని స్టేజ్
4 అని
అంటారని, కిడ్నీ
పనితీరు మరింత క్షీణిస్తే ఆయనకు డయాలసిస్ చేయాల్సి ఉంటుందని, అప్పుడు
ఆయనను ఎయిమ్స్కు రిఫర్ చేస్తామని వైద్యులు అంటున్నారు.