క్షీణించిన లాలూ ప్రసాద్ ఆరోగ్యం ..
By: Sankar Sun, 13 Dec 2020 07:54 AM
బీహార్ దిగ్గజ నేత లాలూ ప్రసాద్ యాదవ్ ఆరోగ్యంపై అయన డాక్టర్ ఉమేష్ ప్రసాద్ మాట్లాడారు..లాలూ మూత్ర పిండాలు 25 శాతం మాత్రమే పనిచేస్తున్నందున ఏ సమయంలోనైనా పరిస్థితి క్షీణించే అవకాశాలున్నాయని చెప్పారు.
లాలూ పరిస్థితిని ఆయన చికిత్స పొందుతున్న రాజేంద్ర ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ అధికారులకు డాక్టర్ ఉమేష్ ప్రసాద్ లిఖిత పూర్వకంగా తెలిపారు. గతంలో కూడా తాను ఇదే విషయం చెప్పానని.. లాలూ కిడ్నీ 25 శాతం మాత్రమే పనిచేస్తోందనేది నిజమన్నారు. పనితీరు భవిష్యత్తులో మరింత దిగజారిపోవచ్చని... అయితే ఎప్పుడనేది మాత్రం చెప్పడం కష్టమని పేర్కొన్నారు డాక్టర్ ప్రసాద్.
గత 20 ఏళ్లుగా ఆయన మధుమేహ వ్యాధితో బాధపడుతున్నందున కిడ్నీ దెబ్బతింటూ వచ్చిందని.. పెషెంట్ ఆరోగ్యం ఆందోళనకరంగానే ఉందని రిమ్స్కు లిఖితపూర్వకంగా తెలిపానని ఆయన వెల్లడించారు..