Advertisement

  • 2007 టి ట్వంటీ ప్రపంచ కప్ విషయంలో ఆ దిగ్గజాలు బాధపడ్డారు ..మాజీ మేనేజర్ లాల్‌చంద్‌ రాజ్‌పుత్‌

2007 టి ట్వంటీ ప్రపంచ కప్ విషయంలో ఆ దిగ్గజాలు బాధపడ్డారు ..మాజీ మేనేజర్ లాల్‌చంద్‌ రాజ్‌పుత్‌

By: Sankar Tue, 30 June 2020 09:16 AM

2007 టి ట్వంటీ ప్రపంచ కప్ విషయంలో ఆ దిగ్గజాలు బాధపడ్డారు ..మాజీ మేనేజర్ లాల్‌చంద్‌ రాజ్‌పుత్‌



ఇండియన్ క్రికెట్ లో 2007 ఏడాదికి ఒక ప్రత్యేక స్థానం ఉంది ..ఆరు నెలల తేడాలోనే భారత జట్టు ఒక చేదు ఫలితాన్ని , ఒక మధుర ఫలితాన్ని సాధించింది ..అవే 2007 వన్ డే ప్రపంచకప్ లో తొలి రౌండ్ లోనే వెనుదిరిగి చేదు ఫలితాన్ని చవి చుసిన భారత జట్టు , అదే ఏడాది జరిగిన టి ట్వంటీ ప్రపంచకప్ లో సంచలన ఆటతీరుతో కప్పును ఎగరేసుకుపోయింది ..ద్రావిడ్ సారథ్యంలో వన్ డే ప్రపంచ కప్ లో భారత్ వెనుదిరగడంతో ద్రావిడ్ తో పాటు , సీనియర్ ఆటగాళ్లు అయిన సచిన్ , గంగూలీ లు టి ట్వంటీ ప్రపంచకప్ కు దూరంగా ఉన్నారు ..అయితే వాళ్ళు ఆలా దూరం అయినందుకు బాధపడే ఉంటారు అంటున్నాడు భారత జట్టు మాజీ మేనేజర్ లాలచంద్ రాజపుత్ ..

ఈ మెగా టోర్నీలో ఆడరాదని నాటి సీనియర్లు సచిన్‌ టెండూల్కర్, సౌరవ్‌ గంగూలీ, రాహుల్‌ ద్రవిడ్‌ అంతకు కొద్దిరోజుల క్రితమే నిర్ణయించుకున్నారు. ఫలితంగా ధోని కెప్టెన్‌గా యువ జట్టు బరిలోకి దిగింది. దీనికి సంబంధించిన మరో ఆసక్తికర అంశాన్ని ఆ జట్టుకు మేనేజర్‌గా వ్యవహరించిన లాల్‌చంద్‌ రాజ్‌పుత్‌ పంచుకున్నారు. అప్పటి టెస్టు, వన్డే కెప్టెన్‌ ద్రవిడ్‌ తనతో పాటు మిగతా ఇద్దరినీ ఇందు కోసం ఒప్పించాడని ఆయన చెప్పారు.

తానే కాదు... సచిన్, గంగూలీ కూడా టి20 వరల్డ్‌కప్‌ ఆడాల్సిన అవసరం లేదని ద్రవిడ్‌ భావించాడు. తనే స్వయంగా వారికి చెప్పి నిరోధించాడనేది వాస్తవం. దానికి ముందు జరిగిన ఇంగ్లండ్‌ సిరీస్‌లో ద్రవిడ్‌గా కెప్టెన్‌గా ఉన్నాడు. కొందరు ఆటగాళ్లయితే నేరుగా ఇంగ్లండ్‌ నుంచే వరల్డ్‌కప్‌ కోసం దక్షిణాఫ్రికా వచ్చారు. ఆ సమయంలో కుర్రాళ్లకు చాన్స్‌ ఇద్దామని ద్రవిడ్‌ చెప్పాడు. అయితే మన జట్టు ప్రపంచకప్‌ గెలిచిన తర్వాత వారంతా కచ్చితంగా పశ్చాత్తాప పడి ఉంటారు. ఎందుకంటే నేను ఇన్నేళ్లుగా ఆడుతున్నా ఒక్క ప్రపంచకప్‌ కూడా గెలవలేదు అని సచిన్‌ నాతో తరచుగా చెప్పేవాడు’ అని రాజ్‌పుత్‌ అన్నారు.

Tags :
|
|

Advertisement