బీజేపీలో చేరిన లేడీ బాస్...
By: chandrasekar Mon, 07 Dec 2020 6:52 PM
సినీ గ్లామర్తో
పొలిటికల్ ఫీల్డ్లో దుమ్ము దులిపిన సినీ నటులు ఎంతో మంది ఉన్నారు. కావాల్సినంత
గ్లామర్, ప్రజల్లో
ఎంతో గుర్తింపు అన్నీ ఉన్నా... రాములమ్మ మాత్రం ఇప్పటివరకూ రాజకీయాల్లో
చెప్పుకోతగ్గ పాత్రను పోషించలేక పోయింది. సినిమాల్లో లేడీ బాస్గా, లేడీ
అమితాబ్గా గుర్తింపు ఉన్నా అవేవీ ఆమెకు రాజకీయాల్లో ఇప్పటివరకూ కలిసి రాలేదు.
తాజాగా ఢిల్లీలో... బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి అరుణ్ సింగ్ సమక్షంలో కమలం కండువా కప్పుకున్నారు. ఈ కార్యక్రమంలో
కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, ఓబీసీ మోర్చా అధ్యక్షుడు లక్ష్మణ్, బీజేపీ
తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ తదితరులు పాల్గొన్నారు.
విజయశాంతి రాకతో
తెలంగాణలో తమ పార్టీ మరింత పుంజుకుంటుందనే విశ్వాసంతో బీజేపీ శ్రేణులు ఉన్నాయి. 1998లో
బీజేపీతోనే విజయశాంతి రాజకీయ ఆరంగేట్రం జరిగింది. తర్వాత తల్లి తెలంగాణ పార్టీ పెట్టారు.
కొన్నాళ్లకు దాన్ని టీఆర్ఎస్లో కలిపేశారు. టీఆర్ఎస్ నుంచి లోక్ సభకు ఎన్నికై
తర్వాత టీఆర్ఎస్ నుంచి సస్పెండ్ అయ్యారు. టీఆర్ఎస్లో విబేధాలతో ఈ మాజీ మెదక్ ఎంపీ
2014
ఫిబ్రవరిలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. మెదక్ నుంచి కాంగ్రెస్ తరపున పోటీ చేశారు.
కానీ, కాంగ్రెస్
పార్టీలోనూ ఆమె అధిష్టానానికి దూరంగా ఉంటూ వచ్చారు. పార్టీ కార్యక్రమాలకు కూడా
దూరంగా ఉన్నారు. ఈ మధ్య బీజేపీకి అనుకూలంగా మాట్లాడటంతో... ఆమె బీజేపీలో
చేరబోతున్నారనే ప్రచారం జరిగింది. అందుకు తగ్గట్టుగానే రాములమ్మ ఎవరు తీసుకున్న
గోతిలో వారే పడతారన్న సామెత సీఎం కేసీఆర్కు సరిగ్గా వర్తించే సమయం సమీపించిందని
అన్నారు. తద్వారా ఆమె బీజేపీ వైపు వెళ్తూ టీఆర్ఎస్ని టార్గెట్ చేస్తున్నట్లు
తెలుస్తోంది.