Advertisement

భారీగా పెరిగిన శ్రీశైల మల్లన్న లడ్డు ధర

By: Sankar Thu, 19 Nov 2020 11:03 AM

భారీగా పెరిగిన శ్రీశైల మల్లన్న లడ్డు ధర


దక్షిణ భారతంలో ప్రముఖ శైవక్షేత్రం శ్రీశైలంలో కార్తీక మాసం లో భక్తుల రద్దీ విపరీతంగా ఉంటున్న విషయం తెలిసిందే .. తాకిడిని తట్టుకునేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. ఈ క్రమంలో మల్లన్న లడ్డూ ప్రసాదం ధరను అమాంతం పెంచేశారు ఆలయ అధికారులు. దీంతో సామాన్య భక్తులపై ఈ ప్రభావం పడనుంది.

గతంలో 80 గ్రాముల లడ్డు 10 రూపాయలు ఉంది. భరత్ గుప్తా ఈఓ గా ఉన్న సమయంలో 100 గ్రాములు లడ్డు ధర 15 రూపాయలు చేశారు. ఇప్పుడు 100 గ్రాముల లడ్డూ ధర 20 రూపాయలకు పెంచారు. దీంతో ఏడాది కాలంలో లడ్డూ ధర రెండింతలైంది.

కోవిడ్‌ వల్ల నెలల పాటు శ్రీశైల క్షేత్రాన్ని మూసేసారు అధికారులు. ఆలయంలో కైంకర్యాలను ఆపకపోయినా.. భక్తులను అనుమతించలేదు. తర్వాత తెరుచుకున్నా.. మళ్లీ మళ్లీ మూసేశారు. దీంతో ఆలయ ఆదాయానికి గండి పడింది. ఇప్పుడు కార్తీక మాసం కావడంతో.. భక్తులు పోటెత్తారు. పనిలోపనిగా లడ్డూ ధర కూడా పెంచడంతో.. అటు హుండీ ఆదాయంతోపాటు.. ఇటు లడ్డూలపైనా ఆదాయం పెరగనుంది.

Tags :
|
|
|
|

Advertisement