Advertisement

  • బీజేపీలో చేరి కుష్బూ మంచిప‌ని చేశారన్న అన్నాడీఎంకే...

బీజేపీలో చేరి కుష్బూ మంచిప‌ని చేశారన్న అన్నాడీఎంకే...

By: chandrasekar Tue, 13 Oct 2020 2:52 PM

బీజేపీలో చేరి కుష్బూ మంచిప‌ని చేశారన్న అన్నాడీఎంకే...


సోమ‌వారం ఉద‌యం త‌మిళ న‌టి కుష్బూ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి బీజేపీలో చేర‌డాన్ని త‌మిళ‌నాడులోని అధికార అన్నాడీఎంకే పార్టీ స్వాగ‌తించింది.

త‌మ మిత్ర‌ప‌క్షమైన‌ బీజేపీలో చేర‌డం ద్వారా కుష్బూ సుంద‌ర్ మంచిప‌ని చేశార‌ని, ఇది చాలా సంతోష‌క‌ర‌మైన ప‌రిణామ‌మ‌ని అన్నాడీఎంకే సీనియ‌ర్ నాయ‌కుడు, మ‌త్స్య‌శాఖ మంత్రి డీ జ‌య‌కుమార్ తెలిపారు.

కుష్బూకు అన్నాడీఎంకే పార్టీ త‌ర‌ఫున శుభాకాంక్ష‌లు, అభినంద‌న‌లు తెలిపారు. గ‌త ఆరేండ్లుగా కాంగ్రెస్ పార్టీలో కొన‌సాగిన కుష్బూ ఆ పార్టీకి రాజీనామా చేశారు.

అనంత‌రం ఢిల్లీలోని బీజేపీ ప్ర‌ధాన కార్యాల‌యానికి వెళ్లి త‌మిళ‌నాడు బీజేపీ అధ్య‌క్షుడు ఎల్ మురుగ‌న్ స‌మ‌క్షంలో బీజేపీలో చేరారు.

Tags :
|

Advertisement