Advertisement

  • కర్నూలు: ఆ గ్రామాల్లో పాలు అమ్మితే అంతే సంగతులు.. వందల ఏళ్ళ చరిత్ర!

కర్నూలు: ఆ గ్రామాల్లో పాలు అమ్మితే అంతే సంగతులు.. వందల ఏళ్ళ చరిత్ర!

By: chandrasekar Mon, 19 Oct 2020 11:41 AM

కర్నూలు: ఆ గ్రామాల్లో పాలు  అమ్మితే అంతే సంగతులు.. వందల ఏళ్ళ  చరిత్ర!


‘‘పాలు అమ్మితే పాడై పోతాం.. ఆ డబ్బు మాకొద్దు’’ అంటారు ఆ గ్రామస్తులు. పాలు కావాలని అడిగితే ప్రేమగా పోస్తారు.. అదే డబ్బులివ్వబోతే మాత్రం చుక్క కూడా పోయరు. పాలు అమ్మకూడదన్న వందల ఏళ్ల నాటి కట్టుబాటును ఇప్పటికీ కొనసాగిస్తున్నారు కర్నూలు జిల్లా గంజహళ్లి , కడిమెట్ల గ్రామస్థులు . ఈ కట్టుబాటు ఎలా మొదలయింది? కట్టుబాటును మీరితే ఏమవుతుందో ఆ గ్రామస్తులు కథలుకథలుగా చెబుతారు. ఉచిత పాల వెనుక చరిత్ర ఏమంటే..

కర్నూలు జిల్లా గంజహళ్లిలో 400కు పైగానే పశువులున్నాయి. ప్రతి రోజూ ఐదారు వందల లీటర్ల పాలు ఇస్తాయి. కానీ ఏ రోజూ వారు పాలను అమ్మరు. అవసరమైన మేరకు ఇంట్లో వాడుకుంటారు.. ఎక్కువయితే అడిగిన వారికి ఇస్తారు. కానీ, వారి దగ్గర ఒక్కపైసా కూడా తీసుకోరు. ఊళ్లో వాళ్లందరూ ఇలాగే కట్టుబడి ఉంటారు. గంజహళ్లితో పాటు కడిమెట్ల గ్రామంలోనూ ఇదే ఆచారం కొనసాగుతోంది. ఈ గ్రామాల్లో హోటల్‌ నిర్వాహకులు కూడా పాలు అవసరమైతే పక్కనే ఉన్న గోనెగండ్ల, ఎమ్మిగనూరు ప్రాంతాల నుంచి పాలు తెచ్చుకుని వ్యాపారం చేసుకుంటారు గాని, ఆ గ్రామంలో పాలు కొనరు. ఈ ఆచారం గత 400 ఏళ్లుగా వస్తోంది.

ఎన్నో కథలు

400 ఏళ్ల క్రితం గంజహళ్లి గ్రామంలో పాడి పశువులకు అంతుచిక్కని వ్యాధి సోకిందట. కొన్ని గోవులు, గేదెలు మృత్యువాత పడగా, మరి కొన్ని పశువులు పాలివ్వడం మానేశాయట. ఆ గ్రామంలో రాజయోగి (బడేసాబ్‌ తాత) ఉండేవాడట. ఆయనకు పాలు తాగాలనిపించి, తన కొడుకు హుస్సేన్‌ సాహెబ్‌ను పాలు తీసుకురమ్మని ఊరిలోకి పంపించాడట. పశువులన్నింటికి జబ్బు చేయడంతో ఏ ఒక్కరూ పాలు పోయలేదట. చివరకు గ్రామ పెద్దయిన పెద్దనాగిరెడ్డి ఇంటికి వెళ్లగా తమ గోవు తీవ్రమైన వ్యాధితో ప్రాణం వదిలిందని, ఊరి చివరనున్న మారెమ్మ ఆలయం వద్ద ఆ కళేబరాన్ని పడేశామని చెప్పాడట.

అయితే పాలు కచ్చితంగా తీసుకెళ్లాలని హుస్సేన్‌సాహెబ్‌ మారెమ్మవ్వ గుడి వద్దకు వెళ్ళాడట. పాలు తీసుకెళ్ళకపోతే తండ్రి కోప్పడతాడని హుస్సేన్‌ సాహెబ్‌ మారెమ్మను ప్రార్థించాడట. అతడి ప్రార్థనకు ప్రసన్నురాలైన ఆ తల్లి ‘మీ తండ్రి నామాన్ని ఉచ్చరిస్తూ ఆవును లేపు’ అని చెప్పిందట. మారెమ్మవ్వ దేవత చెప్పిన ప్రకారమే తనతండ్రి పేరును ఉచ్చరిస్తూ.. ‘బాబాబోలీ దూద్‌ దేవ్‌’ అన్నాడట. ఆ మాటలకు ఆవు లేచి హుస్సేన్‌సాహెబ్‌కు పాలు ఇచ్చిందట. ఇప్పటికీ ఈ కథను ఊళ్లలో చెప్పుకుంటూ ఉంటారు.

Tags :

Advertisement