Advertisement

  • ప్రపంచ కప్ ఫైనల్లో ఫిక్సింగ్ ఆరోపణలపై నేడు విచారణకు హాజరు కానున్న సంగక్కర

ప్రపంచ కప్ ఫైనల్లో ఫిక్సింగ్ ఆరోపణలపై నేడు విచారణకు హాజరు కానున్న సంగక్కర

By: Sankar Thu, 02 July 2020 09:23 AM

ప్రపంచ కప్ ఫైనల్లో ఫిక్సింగ్ ఆరోపణలపై నేడు విచారణకు హాజరు కానున్న సంగక్కర



2011 క్రికెట్ ప్రపంచ కప్ ఫైనల్లో ఇండియా శ్రీలంక జట్లు తలపడగా ఇండియా ఘన విజయం సాధించింది ..అయితే ఆ మ్యాచ్ లో శ్రీలంక ఆటగాళ్లు కావాలనే ఓడిపోయారు అని అప్పటి ఆదేశ క్రీడా మంత్రి ఇటీవల ఆరోపించిన సంగతి తెలిసిందే ..అయితే అతడి ఆరోపణలను తీవ్రంగా తీసుకున్న శ్రీలంక ప్రభుత్వం విచారణకు ఆదేశించింది ..ఇప్పటికే మాజీ క్రీడల మంత్రి మహిందనంద ను విచారించగా అతడు కేవలం తాను అనుమానం మాత్రమే వ్యక్తం చేశాను అని మాట మార్చిన విషయం తెలిసిందే ..

అయితే ప్రత్యేక దర్యాప్తు బృందం (ఎస్‌ఐయూ) ముందు నేడు శ్రీలంక మాజీ కెప్టెన్‌ కుమార సంగక్కర హాజరు కానున్నాడు.సంగక్కర అప్పటి టీం కెప్టెన్ కావడంతో అతడిని విచారణకు హాజరు అవ్వాలని ఆదేశించారు ..ఫొన్సెక నేతృత్వంలోని బృందం ఆ ఫైనల్లో భారత్‌ చేతిలో ఓడిన శ్రీలంక ఆటగాళ్లను విచారిస్తోంది.

గురువారం ఉదయం 9 గంటలకు విచారణకు హాజరు కావాల్సిందిగా 2011 వరల్డ్‌కప్‌లో శ్రీలంకకు కెప్టెన్‌గా వ్యవహరించిన సంగక్కరను కోరింది. బుధవారం ఓపెనర్‌ ఉపుల్‌ తరంగాను రెండు గంటల పాటు విచారించింది. నాటి వరల్డ్‌కప్‌ ఫైనల్లో తరంగ 20 బంతులు ఆడి రెండు పరుగులు చేశాడు. కమిటీ అడిగిన ప్రశ్నలకు జవాబిచ్చాను. నా స్టేట్‌మెంట్‌ను వారు రికార్డు చేశారు అని తరంగ తెలిపాడు.

కానీ ప్రశ్నలేంటో చెప్పలేదు. అప్పట్లో చీఫ్‌ సెలక్టర్‌గా వ్యవహరించిన శ్రీలంక విఖ్యాత ఆటగాడు అరవింద డిసిల్వాను మంగళవారం ఆరు గంటల పాటు సుదీర్ఘంగా విచారించారు. లంకలో ఫిక్సింగ్‌కు పాల్పడితే క్రిమినల్‌ నేరం కింద కఠినంగా శిక్షిస్తారు. లంక కరెన్సీలో రూ. 10 కోట్ల జరిమానాతో పాటు పదేళ్ల జైలు శిక్ష విధించేలా గత నవంబర్‌లో చట్టం తెచ్చారు.

Tags :
|
|

Advertisement