21వ శతాబ్దపు ఇంజినీరింగ్ అద్భుతం...కేబుల్ బ్రిడ్జిని ప్రారంభించిన కేటీఆర్
By: chandrasekar Sat, 26 Sept 2020 1:53 PM
రాష్ట్ర పురపాలక, ఐటీశాఖ
మంత్రి కె తారకరామారావు రాష్ట్ర రాజధాని హైదరాబాద్లో దుర్గం చెరువుపై నిర్మించిన
కేబుల్ బ్రిడ్జిని శుక్రవారం సాయంత్రం ప్రారంభించారు. కేంద్ర మంతి కిషన్రెడ్డి, రాష్ట్ర
మంత్రులు తలసాని శ్రీనివాస్యాదవ్, సబితా ఇంద్రారెడ్డి, శ్రీనివాస్గౌడ్, జీహెచ్ఎంసీ
మేయర్ బొంతు రామ్మోహన్, ఎంపీ రంజిత్రెడ్డి పాల్గొన్నారు.
తెలంగాణ ప్రభుత్వం అత్యంత
ప్రతిష్ఠాత్మకంగా రూ.184 కోట్ల వ్యయంతో దుర్గం చెరువుపై వంతెనను
నిర్మించింది. ఎస్సార్డీపీ పనుల్లో భాగంగా జీహెచ్ఎంసీ దీని నిర్మాణం చేపట్టింది.
21వ
శతాబ్దపు ఇంజినీరింగ్ అద్భుతంగా అధికారులు చెబుతున్నారు. 754.38 మీటర్ల పొడవైన ఈ బ్రిడ్జితో మాదాపూర్, జూబ్లీహిల్స్ల
మధ్య దూరం గణనీయంగా తగ్గనుంది.
రోడ్ నంబర్ 36, జూబ్లీహిల్స్, మాదాపూర్లో
ట్రాఫిక్ సమస్య నుంచి వాహనదారులకు ఉపశమనం లభించినట్లయింది .అలాగే జూబ్లీహిల్స్
రోడ్ నంబర్ 45 ఎలివేటెడ్ కారిడార్ను ప్రారంభించారు. దుర్గం
చెరువు కేబుల్ బ్రిడ్జి జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 45ను కలుపుతూ ఫ్లై ఓవర్ను
నిర్మించారు. ఈ ఫ్లై ఓవర్కు పెద్దమ్మతల్లి ఎక్స్ ప్రెస్వేగా నామకరణం చేశారు.