కేటీఆర్ ప్రెస్స్ మీట్...చిల్లరమల్లర రాజకీయాలు చేయడం సరికాదు...!
By: Anji Sun, 08 Nov 2020 1:19 PM
ప్రజలు కష్టాల్లో ఉన్నప్పుడు రాజకీయ పార్టీలు చిల్లరమల్లర రాజకీయాలు చేయడం సరికాదన్నారు తెలంగాణ మంత్రి కేటీఆర్.
హైదరాబాద్ లో భారీవర్షం, వరదలు ప్రజల్ని కష్టాల్లోకి నెడితే, ప్రజలకు ఉపశమనాన్ని ఇచ్చేందుకు సహకరించాల్సింది పోయి బీజేపీ నేతలు, ఆపార్టీ కార్యకర్తలు తప్పుడు ప్రచారాలు, ఇబ్బందికర పరిస్థితులు సృష్టిస్తున్నారని కేటీఆర్ మండిపడ్డారు.
విపక్షాలు ప్రజలకు, ప్రభుత్వానికి భారం కాకూడదన్నారు. కేంద్రంలోని బీజేపీ సర్కారు నుంచి ఎలాంటి సహాయం అందకున్నా చరిత్రలో ఎన్నడూ లేని విధంగా టీఆర్ఎస్ ప్రభుత్వం హైదరాబాద్ ప్రజలకు అండగా నిలుస్తుందని చెప్పారు.
Tags :
ghmc |
ktr |
live |