Advertisement

  • జిహెచ్ఎంసి లో రెవిన్యూ సమస్యలపై మంత్రి కేటీఆర్ వీడియో కాన్ఫరెన్స్

జిహెచ్ఎంసి లో రెవిన్యూ సమస్యలపై మంత్రి కేటీఆర్ వీడియో కాన్ఫరెన్స్

By: Sankar Sat, 26 Sept 2020 2:03 PM

జిహెచ్ఎంసి లో రెవిన్యూ సమస్యలపై మంత్రి కేటీఆర్ వీడియో కాన్ఫరెన్స్


దేశంలోని లక్షలాది మందికి హైదరాబాద్ ఆకర్షణీయ నగరంగా మారిందని మంత్రి కేటీఆర్‌ తెలిపారు. జీహెచ్ఎంసి పరిధిలో వివిధ కాలనీల్లో సంవత్సరాలుగా పేరుకుపోయిన రెవెన్యూ సమస్యల పైన ఇవాళ మంత్రి శ్రీ కేటీఆర్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ఒకవైపు పెట్టుబడులు మరోవైపు పరిపాలనా సంస్కరణలు, రాజకీయ స్థిరత్వంతో పెద్ద ఎత్తున హైదరాబాద్ విస్తరిస్తోందన్నారు. తెలంగాణ ప్రభుత్వం నూతన రెవెన్యూ చట్టం తీసుకువచ్చి ప్రతి ఒక్కరికి ఎలాంటి ఇబ్బంది లేకుండా తమ వ్యవసాయ భూముల పైన హక్కులు కల్పించాలనే లక్ష్యంతో ముందుకు పోతున్నదని పేర్కొన్నారు. సామాన్యుడిపై ఎలాంటి భారం పడకుండా సామాన్యుడికి అండగా ఉంటూ... అవినీతికి పాతర వేస్తూ నూతన చట్టానికి ఆమోద ముద్ర వేసుకున్నామని వెల్లడించారు.

భవిష్యత్తులో అన్ని రిజిస్ట్రేషన్లు ధరణి పోర్టల్ ఆధారంగానే జరుగుతాయని.. వ్యవసాయ, వ్యవసాయేతర ఆస్తులకి ప్రత్యేకంగా రెండు వేరు వేరు రంగుల్లో పాస్ పుస్తకాలు ఇస్తామని పేర్కొన్నారు. హైదరాబాద్ నగరంలో సుమారు 24 లక్షల 50 వేల ఆస్తులు ఉన్నట్లు అంచనా వేసామని... ఇందులో వివిధ కారణాలతో కొన్ని ఆస్తుల హక్కులపై సమస్యలు ఉన్నాయని తెలిపారు.

హైదరాబాద్ ప్రజలు నిశ్చింతగా వారి ఆస్తి హక్కులను పొందేలా, సమస్యలను పరిష్కరించేలా, పేద, మధ్యతరగతి ప్రజలకు వారి ఆస్తుల పట్ల హక్కులు కల్పించాలని ప్రయత్నం చేస్తున్నామని వెల్లడించారు. భవిష్యత్తులో హైదరాబాద్ లోని ఆస్తుల క్రయ విక్రయాల్లో ఇబ్బందులు లేకుండా చూస్తామని హామీ ఇచ్చారు. రానున్న 15 రోజుల పాటు ధరణి పోర్టల్ లో ఆస్తుల నమోదు కార్యక్రమంలో ప్రజాప్రతినిధులంతా చురుగ్గా పాల్గొనాలని.. ఈ కార్యక్రమంలో ఎవరు కూడా దళారులను నమ్మవద్దని ఒక్కపైసా ఇవ్వవద్దని విజ్ఞప్తి చేశారు మంత్రి కేటీఆర్‌.

Tags :
|

Advertisement