కేటీఆర్ ఎన్నికల ప్రచారం ప్రారంభం...
By: chandrasekar Sat, 21 Nov 2020 5:37 PM
జీహెచ్ఎంసీ ఎన్నికల
ప్రచారాన్ని శనివారం నుంచి టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి
కేటీఆర్ ప్రారంభించనున్నారు. కూకట్పల్లి నియోజకవర్గం నుంచి రేపు కేటీఆర్ రోడ్
షో మొదలవనుంది.
కూకట్పల్లి, కుత్బుల్లాపూర్
నియోజకవర్గాల్లో 4 చోట్ల నిర్వహించనున్న రోడ్షోల్లో కేటీఆర్
పాల్గొననున్నారు. ఈనెల 28న ఎల్బీ స్టేడియంలో భారీ బహిరంగ సభ ఉండనుంది.
శనివారం కేటీఆర్ ఎన్నికల
ప్రచారం షెడ్యూల్ లో సాయంత్రం 5 గంటలకు ఓల్డ్ అల్లాపూర్ చౌరస్తాలో రోడ్షో
నిర్వహించనున్నారు. సాయంత్రం 6గంటలకు మూసాపేట్ చిత్తారమ్మ తల్లి చౌరస్తాలో రోడ్షో
జరగనుంది. రాత్రి 7 గంటలకు కుత్బుల్లాపూర్ నియోజకవర్గం ఐడీపీఎల్
చౌరస్తా. అనంతరం రాత్రి 8 గంటలకు సాగర్ హోటల్ జంక్షన్లో కేటీఆర్ ఎన్నికల
ప్రచారం నిర్వహించనున్నారు.