Advertisement

  • తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు... కేటీఆర్ , రాజగోపాల్ రెడ్డి మధ్య వాడివేడి చర్చ

తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు... కేటీఆర్ , రాజగోపాల్ రెడ్డి మధ్య వాడివేడి చర్చ

By: Sankar Thu, 10 Sept 2020 4:48 PM

తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు... కేటీఆర్ , రాజగోపాల్ రెడ్డి మధ్య వాడివేడి చర్చ


తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న విషయం తెలిసిందే. అయితే... ఇవాళ జరిగిన జీరో అవర్ లో మున్సిపాలిటీల అభివృద్ధిపై వేడివాడి చర్చ జరిగింది. ఈ సందర్బంగా మునుగోడు ఎమ్మెల్యే కోమటి రెడ్డి రాజగోపాల్ కి మంత్రి కేటీఆర్ కౌంటర్ ఇచ్చారు.

జీరో అవర్ లో కోమటి రెడ్డి రాజగోపాల్ చోటుప్పల్, చండూర్ మున్సిపాలిటీల అభివృద్ధిపై ప్రభుత్వాన్ని నిలదీశారు. చోటుప్పల్ మున్సిపాలిటీకి రూ. 20 కోట్లు, చండూర్ మున్సిపాలిటీకి రూ. 10 కోట్లు ప్రభుత్వం మంజూరై రెండేండ్లయినా ఒక్క రూపాయి విడుదల కాలేదని రాజగోపాల్ ఫైర్ అయ్యారు.

అయితే దీనిపై మంత్రి కేటీఆర్ పట్టణ ప్రగతి కింద అన్ని మున్సిపాలిటీలకు నెలకు రూ.148 కోట్లు విడుదల అవుతున్నాయని ఎమ్మెల్యే రాజగోపాల్ తెలుసుకోవాలని చురకలు అంటించారు. టీఆర్ఎస్ ప్రభుత్వం అభివృద్ధి చేయకపోతే... 130 మున్సిపాలిటీలకు ఎన్నికలు జరిగితే 122 చైర్మన్లను ఎలా గెలుచుకున్నామని కేటీఆర్ అన్నారు. జీరో అవర్ లో హీరోగిరి చేస్తే మంచిది కాదని రాజగోపాల్ కు కేటీఆర్ కౌంటర్ ఇచ్చారు.

Tags :
|

Advertisement