ఖమ్మం పర్యటనలో కేటీఆర్ మిత్ర బృందం షాక్...
By: chandrasekar Mon, 07 Dec 2020 7:04 PM
ఇవాళ ఖమ్మం నగరంలో
తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటిఆర్ టీమ్ పర్యటిస్తున్న
విషయం తెలిసిందే. ఈ పర్యటనలో కేటీఆర్ టీమ్కు భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు జలక్
ఇచ్చారు. ఎల్ఆర్ఎస్ రద్దు చేయాలి అని డిమాండ్ చేస్తూ కేటీఆర్ మిత్ర బృందం
ప్లకార్డులు ప్రదర్శించారు. ఎల్ఆర్ఎస్ వద్దు.. టీఆర్ఎస్ వద్దూ అంటూ నినాదాలు
చేశారు. దీంతో కేటీఆర్ మిత్ర బృందం షాక్ అయింది. దీంతో కేటీఆర్ పర్యటన కాస్త
ఆలస్యం అయింది.
వెంటనే రంగంలోకి దిగిన
పోలీసులు భాజపా కార్యకర్తలను అరెస్ట్ చేసి రూరల్ పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఐటీ
టరవ్ ప్రారంభోత్సవం కోసం ఇవాళ ఖమ్మం వెళ్లిన కేటీఆర్. స్థానికంగా రఘునాథపాలెంలో
ఏర్పాటు చేసిన సభలో మాట్లాడిన కేటీఆర్ రేపటి భారత్ బంద్లో రాష్ట్ర రైతులు
పాల్గొనాలి అని తెలంగాణ రైతులను కోరారు. వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఢిల్లీలో
రైతులు ఆందోళ చేస్తున్నారు. అందులో భాగంగా డిసెంబర్ 8న
భారత్ బంద్ ప్రకటించారు. దానికి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మద్దతు ప్రకటించిన
విషయం తెలిసిందే.