Advertisement

  • పార్టీ నియమాలను పాటించకపోవడం వల్లే కృష్ణంరాజుకి నోటీసులు: విజయసాయిరెడ్డి

పార్టీ నియమాలను పాటించకపోవడం వల్లే కృష్ణంరాజుకి నోటీసులు: విజయసాయిరెడ్డి

By: chandrasekar Thu, 25 June 2020 6:33 PM

పార్టీ నియమాలను పాటించకపోవడం వల్లే కృష్ణంరాజుకి నోటీసులు: విజయసాయిరెడ్డి


పార్టీ నిబంధనలు ఉల్లంఘించిన వారు ఎంత పెద్దవారైనా క్రమశిక్షణా చర్యలు తప్పవని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ప్రధాన కార్యదర్శి, ఎంపీ విజయసాయిరెడ్డి తేల్చి చెప్పారు. ఎంపీ రఘురామ కృష్ణంరాజు మీడియాలో మాట్లాడిన వ్యవహారాలపైనే షోకాజ్ నోటీసు ఇచ్చినట్లు వెల్లడించారు.

ఈ మేరకు బుధవారం ఎంపీ విజయసాయిరెడ్డి మీడియాతో మాట్లాడుతూ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఇతర ఎంపీల‌కంటే రఘురామ కృష్ణంరాజుకే ఎక్కువ విలువ ఇచ్చారని తెలిపారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ వల్లే ఆయనకు పదవులు లభించాయని విజయసాయిరెడ్డి స్పష్టం చేశారు. పార్టీ నియమాలను పాటించకపోవడం వల్లే రఘురామ కృష్ణంరాజుకి నోటీసులు ఇచ్చామని వెల్లడించారు.

అలాగే సోషల్ మీడియాలో అసభ్యకరమైన పోస్టులు ఎవరు పెట్టినా పార్టీకలతీతంగా చర్యలు ఉంటాయని విజయసాయిరెడ్డి స్పష్టం చేశారు. అసభ్యకరంగా మహిళల పట్ల పోస్టులు పెట్టడం వల్లే చర్యలు తీసుకున్నామని, అసభ్యకరంగా కాకుండా విమర్శనాత్మకంగా ఉంటే ఫరవాలేదన్నారు.

అలాగే నిమ్మగడ్డ రమేష్ కుమార్ అనే వ్యక్తి గతంలో ఒక రాజ్యాంగబద్ధ పదవిలో ఉన్నారని, ఆయన ఆ పదవికి అనర్హుడని విజయసాయిరెడ్డి తెలిపారు. చంద్రబాబు డైరక్షన్‌లోనే నిమ్మగడ్డ ప్రభుత్వంపై కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు.

ఈ మొత్తం వ్యవహారంపై పూర్తి స్థాయి దర్యాప్తు జరపాలని, విచారణను వేగవంతం చేయాలని గతంలోనే డీజీపీకి లేఖ రాసినట్లు వెల్లడించారు. టీడీపీ ఎంపీ రాసిన లేఖనే నిమ్మగడ్డ కేంద్రానికి పంపారని గతంలోనే ఆరోపించారు. సుజనా చౌదరితో నిమ్మగడ్డకి ఏం పని వారిద్దరికీ మధ్య ఏం వ్యాపార లావాదేవీలు ఉంటాయని సాయిరెడ్డి ప్రశ్నించారు.

Tags :
|

Advertisement