కోజికోడ్ విమాన ప్రమాదం మృతులు 19మంది
By: Dimple Sat, 08 Aug 2020 10:58 AM
దుబాయ్ నుంచి కోజికోడ్కు వచ్చిన ఎయిరిండియా విమానం గమ్యస్థానానికి చేరుకున్న తర్వాత ప్రమాదానికి గురయ్యింది. భారీ వర్షం కురువడంతో తొలుత గాల్లోనే చక్కర్లు కొట్టిన విమానం.. తర్వాత ల్యాండింగ్ అవుతుండగా.. రన్వేను ఢీకొట్టి పక్కకు జారిపోయింది. ఈ విమాన ప్రమాదంలో మృతుల సంఖ్య 19కి చేరింది. వీరిలో ఇద్దరు పైలట్లు సహా ఆరుగురు సిబ్బంది ఉన్నారని పౌరవిమానయాన శాఖ వెల్లడించింది. ప్రమాదంలో 120 మందికిపైగా గాయపడ్డారని పేర్కొంది. క్షతగాత్రుల్లో 171 మంది చుట్టుపక్కల ప్రాంతాల్లోని 13 ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారని తెలిపింది. వీరిలో ఓ గర్భిణి, నలుగురు చిన్నారులు సహా మరో 23 మంది పరిస్థితి విషమంగా ఉన్నట్టు పౌరవిమానయాన శాఖ వివరించింది. కాగా, ఈ ప్రమాదంపై విచారణకు ఓ బృందం ఇప్పటికే కోజికోడ్కు చేరుకుంది. ఈ మధ్యాహ్నం 2.00 గంటలకు మరో బృందం కోజికోడ్ చేరుకోనుంది.ప్రమాదంలో మృతిచెందిన 19 మందిలో 18 మందిని గుర్తించామని, ఇంకొకర్ని గుర్తించాల్సి ఉందని అధికారులు తెలిపారు. మృతదేహాలకు కోవిడ్ ప్రోటోకాల్ ప్రకారం.. పోస్ట్మార్టం నిర్వహించనున్నారు.