Advertisement

  • కొవాగ్జిన్ టీకా క్లినికల్ ట్రయల్స్ లో తొలి టీకాను వేసుకున్న ఆరోగ్య మంత్రి

కొవాగ్జిన్ టీకా క్లినికల్ ట్రయల్స్ లో తొలి టీకాను వేసుకున్న ఆరోగ్య మంత్రి

By: chandrasekar Sat, 21 Nov 2020 10:34 AM

కొవాగ్జిన్ టీకా క్లినికల్ ట్రయల్స్ లో  తొలి టీకాను వేసుకున్న ఆరోగ్య మంత్రి


కరోనా కోసం వివిధ కంపెనీల టీకా క్లినికల్ ట్రయల్స్ నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా కొవాగ్జిన్ టీకా క్లినికల్ ట్రయల్స్ లో తొలి టీకాను ఒక ఆరోగ్య మంత్రి తీసుకున్నారు. దేశ పౌరులు ఆశగా ఎదురుచూస్తున్న భారత్ బయోటెక్ ఫార్మా సంస్థ కరోనా వ్యాక్సిన్ కోవాక్సిన్ కీలకమైన మూడో దశ ట్రయ్సల్స్ శుక్రవారం, నవంబర్ 20 ప్రారంభమయ్యాయి. హర్యానా ఆరోగ్య మంత్రి అనిల్ విజ్ తొలి టీకాను తీసుకున్నారు. అంబాలాలోని సివిల్ హాస్పిటల్‌లో నిపుణులైన వైద్యుల పర్యవేక్షణలో ఆయనకు వ్యాక్సిన్ తొలి డోసు ఇచ్చారు. కొవాగ్జిన్ టీకా క్లినికల్ ట్రయల్స్ కోసం తాను వాలంటీర్‌గా స్వచ్ఛందంగా పేరు నమోదు చేసుకున్నట్లు అనిల్ విజ్ బుధవారం ట్విటర్ వేదికగా వెల్లడించారు. అంబాలా నుంచి హర్యానా అసెంబ్లీకి ప్రాతినిధ్యం వహిస్తున్న 67 ఏళ్ల ఈ బీజేపీ నేత రోహ్‌తక్‌లోని పీజీఐ నుంచి వచ్చిన డాక్టర్లతో పాటు హర్యానా ఆరోగ్య శాఖకు చెందిన వైద్యుల పర్యవేక్షణలో కొవాగ్జిన్ టీకా డోసు తీసుకున్నారు.

కరోనా వైరస్ ను అరికట్టడం కోసం హైదరాబాద్ ప్రధాన కేంద్రంగా పనిచేస్తున్న భారత్ బయోటెక్ ఇప్పటికే తొలి రెండు దశల క్లినికల్ ట్రయల్స్‌ను విజయవంతంగా పూర్తిచేసింది. దీంతో మూడో దశకు డ్రగ్‌ కంట్రోల్‌ జనరల్‌ ఆఫ్‌ ఇండియా అనుమతులు ఇచ్చింది. ఐసీఎంఆర్‌ భాగస్వామ్యంతో భారత్ బయోటెక్ ఈ వ్యాక్సిన్ ప్రయోగాలు చేస్తోంది. దేశవ్యాప్తంగా 25 కేంద్రాల్లో 26 వేల మంది వాలంటీర్లతో మూడో దశ క్లినికల్‌ ట్రయల్స్‌ నిర్వహించడానికి భారత్‌ బయోటెక్‌ ఏర్పాట్లు చేసింది. కరోనా వ్యాక్సిన్‌ కోసం దేశంలో చేపడుతున్న అతిపెద్ద క్లినికల్‌ ట్రయల్‌ ఇదే. ట్రయల్స్‌లో భాగంగా వాలంటీర్లకు మొదట ఓ ఇంజెక్షన్ ఇస్తారు. ఆ తర్వాత 28 రోజులకు మరో ఇంజెక్షన్ ఇస్తారు. ఫైజర్, మోడెర్నా వ్యాక్సిన్లు సమర్థంగా పనిచేస్తున్నట్లు ప్రకటించిన నేపథ్యంలో భారత్ బయోటెక్ ప్రయోగాలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. దీనివల్ల ఫార్మా కంపెనీల మధ్య పోటీ పెరగనుంది.

Tags :

Advertisement