కొలిక్కిరాని ఆర్టీసీ అంతర్రాష్ట్ర బస్సు సర్వీసు ఒప్పందాలు...
By: chandrasekar Thu, 08 Oct 2020 5:36 PM
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ
రాష్ట్రాల మధ్య బస్సు సర్వీసులను కరోనా వైరస్ వల్ల విధించిన లాక్ డౌన్తో గత ఏడు
నెలలుగా నిలిపి వేసిన సంగతి తెలిసిందే. మళ్లీ వాటిని ప్రారంభించేందుకు ఇరు
రాష్ట్రాల ఉన్నతాధికారులు గతంలో పలుసార్లు కలిసి చర్చించారు.
తాజాగా బుధవారం ఇరు రాష్ట్రాల
ఎండీలు హైదరాబాద్లోని బస్ భవన్లో భేటీ అయ్యారు. ఉన్నతాధికారులు నిర్వహించిన ఈ
సమావేశాన్ని ఆర్టీసీ అంతర్రాష్ట్ర సర్వీసు ఒప్పందాలపై ఎలాంటి నిర్ణయం
తీసుకోకుండానే ముగించారు.
అయితే, చర్చల్లో
భాగంగా 2.65 లక్షల
కిలోమీటర్లకు గానూ 65 వేలు తగ్గించుకుంటామని గతంలో చెప్పిన ఏపీ తాజాగా మరో
40 వేల
కిలోమీటర్లు తగ్గించుకునేందుకు సుముఖత వ్యక్తం చేసింది.
తాజాగా తాము లక్ష 61 వేల
కిలోమీటర్లు నడుపుకుంటామని, మీరు కూడా లక్ష 61 వేల కిలోమీటర్లు బస్సులు నడుపుకోవాలని టీఎస్ఆర్టీసీ
అధికారులు ఏపీఎస్ఆర్టీసీ అధికారులను సూచించారు. దీనిపై ఆలోచించిన ఏపీ అధికారులు
మరోసారి నిర్ణయం తీసుకొని భేటీ అవుతామని చెప్పారు.