Advertisement

  • సునీల్ గవాస్కర్ పై ఫైర్ అయితున్న కోహ్లీ ఫాన్స్ ...ఎందుకో తెలుసా !

సునీల్ గవాస్కర్ పై ఫైర్ అయితున్న కోహ్లీ ఫాన్స్ ...ఎందుకో తెలుసా !

By: Sankar Sun, 27 Dec 2020 07:36 AM

సునీల్ గవాస్కర్ పై ఫైర్ అయితున్న కోహ్లీ ఫాన్స్ ...ఎందుకో తెలుసా !


టీమిండియా దిగ్గజ ఆటగాడు సునీల్ గవాస్కర్ మీద టీమిండియా కెప్టెన్ కోహ్లీ అభిమానులు మండిపడుతున్నారు..ఇటీవల కాలంలో కోహ్లీ మీద ఎక్కువగా విమర్శలు చేస్తున్న గవాస్కర్ తాజాగా కోహ్లీ పాటర్నిటీ లీవ్స్ తీసుకోవడంపై ఆగ్రహం వ్యక్తం చేసాడు..దీనితో పెటర్నిటీ లీవ్ తీసుకున్న కోహ్లీని తప్పుబట్టిన గవాస్కర్‌ ను... కోహ్లీ పట్ల అంత ద్వేశం ఎందుకని ప్రశిస్తున్నారు.

టీమిండియా ఓపెనర్ రోహిత్ శర్మ పెటర్నిటీ లీవ్ తీసుకున్నప్పుడు ఎందుకు మాట్లాడలేదని నిలదీస్తున్నారు. అయితే తన భార్య అనుష్క శర్మ జనవరిలో ఓ బిడ్డకు జన్మనివ్వనున్న కారణంగా కోహ్లీ ఆసీస్ తో జరుగుతున్న టెస్ట్ సిరీస్ లో మూడు మ్యాచ్ లను విడిచి భారత్ కు వచ్చేసాడు.

దీని పై సన్నీ ''బీసీసీఐ పక్షపాతం వహిస్తుంది అని తెలిపారు. బీసీసీఐ ఆటగాళ్లను అందరిని సమానంగా చూడటం లేదు. నటరాజన్ ను పంపించలేదు కానీ... కోహ్లీని పంపిస్తుంది అని పేర్కొన్నాడు. ఇప్పుడు ఈ విషయం పైనే కోహ్లీకి నటరాజన్ కు ఏమైనా సంభంధం ఉందా... అంటూ ట్విటర్ వేదికగా సన్నీ పై మండిపడుతున్నారు.

Tags :
|

Advertisement