క్రికెటర్ సచిన్ టెండూల్కర్ అరుదైన రికార్డ్ ఒకటి బ్రేక్ చేసిన కేఎల్ రాహుల్
By: chandrasekar Fri, 25 Sept 2020 11:58 AM
రాయల్ ఛాలెంజర్స్
బెంగళూరుతో దుబాయ్ వేదికగా జరుగిన మ్యాచ్లో
మెరుపు ఇన్నింగ్స్ ఆడిన కింగ్స్ ఎలెవన్ పంజాబ్ కెప్టెన్ కేఎల్ రాహుల్ ఐపీఎల్లో వేగంగా 2,000
పరుగుల మైలురాయిని అందుకున్న భారత బ్యాట్స్మెన్గా నిలిచాడు. ఐపీఎల్లో భారత
దిగ్గజ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ అరుదైన రికార్డ్ ఒకటి బ్రేక్ చేసాడు.
13 ఏళ్ల ఐపీఎల్ చరిత్రలో ఇప్పటి వరకూ 32 మంది
క్రికెటర్లు ఈ రికార్డ్ని అందుకోగా
ఇందులో 20 మంది భారత క్రికెటర్లు ఉండటం గమనార్హం. ఐపీఎల్లో
వేగంగా 2వేల
పరుగులు సాధించిన భారత ఆటగాళ్ల జాబితాని ఓసారి పరిశీలిస్తే ఇప్పటి వరకూ సచిన్ టెండూల్కర్ 63
ఇన్నింగ్స్లతో నెం.1 స్థానంలో ఉండగా
బుధవారం ఆ రికార్డ్ని 60 ఇన్నింగ్స్లతో కేఎల్ రాహుల్ బ్రేక్ చేశాడు. ఐపీఎల్లో
ముంబయి ఇండియన్స్ తరఫున సచిన్ ఆరు సీజన్లు ఆడిన విషయం తెలిసిందే.
ఇక జాబితాలో గౌతమ్ గంభీర్
(68
ఇన్నింగ్స్లు), సురేశ్ రైనా (69),
వీరేంద్ర సెహ్వాగ్ (70) టాప్-5లో
కొనసాగుతున్నారు. ఐపీఎల్లో అత్యధిక పరుగులు చేసిన బ్యాట్స్మెన్ జాబితాలో విరాట్
కోహ్లీ ప్రస్తుతం 5,426 పరుగులతో నెం.1 స్థానంలో ఉండగా ఆ తర్వాత సురేశ్ రైనా (5368), రోహిత్ శర్మ (4990) టాప్-3లో కొనసాగుతున్నారు. వ్యక్తిగత కారణాలతో ఈ ఏడాది
ఐపీఎల్కి సురేశ్ రైనా దూరమైన విషయం తెలిసిందే. దాంతో రోహిత్ శర్మ రెండో
స్థానానికి చేరే అవకాశం ఉంది.