కెవ్వు కార్తీక్పై గూడూరు పోలీస్ స్టేషన్లో కిడ్నాప్, దాడి కేసు...
By: chandrasekar Mon, 07 Dec 2020 6:53 PM
జబర్దస్త్ కమెడియన్స్
కామెడీతో పాటు సోషల్ మీడియాలో వివాదాలతో ట్రెండింగ్ అవుతూనే ఉంటారు. నాగబాబు
ఉన్నప్పటి నుంచి కూడా ఇలాంటివి జరుగుతూనే ఉన్నాయి. అప్పుడప్పుడూ మనోభావాలు
దెబ్బతిని వేణుపై దాడి చేయడం.. హైపర్ ఆదిపై పోలీసు కేసులు పెట్టడం జరిగాయి.
ఇప్పుడు మరో కమెడియన్ కెవ్వు కార్తీక్పై గూడూరు పోలీస్ స్టేషన్లో కిడ్నాప్, దాడి
కేసు నమోదైంది. ఇది తెలిసి అంతా షాక్ అవుతున్నారు. అసలు ఏం జరిగిందంటే..
భూపతిపేటలో తన సోదరి భర్తపై స్నేహితులతో కలిసి కార్తిక్ దాడి చేసినట్టుగా పోలీసులు
పేర్కొన్నారు. ఈయనపై అలాంటి ఫిర్యాదు రావడంతో కేసు ఫైల్ చేసామని పోలీసులు
అంటున్నారు.
కార్తీక్ వెంట ఐదుగురు
ప్రైవేటు వ్యక్తులు వచ్చి తనపై దాడి చేసినట్లు బాధితుడు రవి కుమార్ ఫిర్యాదులో
తెలిపారు. అంతేకాదు.. తనను కిడ్నాప్ చేసి దాదాపు 15 కిలో మీటర్లు దూరం
కారులో తీసుకెళ్ళి కొట్టించాడని ఆయన ఫిర్యాదులో తెలియజేసాడు. కార్తీక్తో పాటు
అతని తల్లిదండ్రులు, వెంట వచ్చిన వాళ్లపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు
చేసినట్లు ఎస్సై సురేశ్ నాయక్ పేర్కొన్నారు. ఈ విషయంలో ఇప్పటి వరకు కెవ్వు
కార్తిక్ స్పందించలేదు. జబర్దస్త్ కామెడీ షోలో మాస్ అవినాష్తో కలిసి కొన్నేళ్లుగా
స్కిట్స్ చేస్తున్నాడు కార్తీక్. అయితే అవినాష్ బిగ్ బాస్కు వెళ్లిన తర్వాత
ఒక్కడే టీమ్ లీడర్ అయిపోయాడు. సోలోగా స్కిట్స్ చేసుకుంటూ బాగానే ఎంటర్ టైన్ చేస్తున్నాడు. ఇలాంటి సమయంలో ఈయనపై
కిడ్నాప్ కేసు నమోదు కావడం నిజంగానే సంచలనం.