Advertisement

  • ప్రజా ప్రతినిధులు కూడా ప్రభుత్వ ఆసుపత్రులలో వైద్యం తీసుకోని ప్రజలకు భరోసా కలిపించాలి ...కిషన్ రెడ్డి

ప్రజా ప్రతినిధులు కూడా ప్రభుత్వ ఆసుపత్రులలో వైద్యం తీసుకోని ప్రజలకు భరోసా కలిపించాలి ...కిషన్ రెడ్డి

By: Sankar Sun, 12 July 2020 1:18 PM

ప్రజా ప్రతినిధులు కూడా ప్రభుత్వ ఆసుపత్రులలో వైద్యం తీసుకోని ప్రజలకు భరోసా కలిపించాలి ...కిషన్ రెడ్డి



కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆదివారం గాంధీ హాస్పిటల్ ను సందర్శించారు. తన సిబ్బందితో కలిసి ఆస్పత్రికి వెళ్లిన ఆయన కరోనా బాధితులకు వైద్యం ఎలా అందిస్తున్నారనే అంశాలను పరిశీలించారు. ఆస్పత్రిలో కలయ తిరుగుతూ ఐసోలేషన్ వార్డుల్లో వసతులు ఎలా ఉన్నాయనే అంశాలను ఆరా తీశారు. అనంతరం గాంధీ సూపరింటెండెంట్, ఆసుపత్రి సిబ్బందితో మంత్రి మాట్లాడారు. గత రెండు కిషన్ రెడ్డి కోవిడ్-19 బాధితులున్న ఆస్పత్రులను సందర్శిస్తున్న సంగతి తెలిసిందే.

ప్రజా ప్రతినిధులు కరోనా బారిన పడితే ప్రైవేటు ఆసుపత్రుల్లో కాకుండా ప్రభుత్వ ఆసుపత్రుల్లో చికిత్స పొంది ప్రజల్లో నమ్మకం కలిగించాలని కిషన్ రెడ్డి అన్నారు. గాంధీ ఆస్పత్రిపై విశ్వాసాన్ని రాష్ట్ర ప్రభుత్వం కల్పించాలని చెప్పారు. ఇప్పటికే 600 వెంటిలేటర్లు తెలంగాణకు సమకూర్చామని, కరోనా కట్టడికి రాష్ట్రం ఎలాంటి సాయం కోరినా చేస్తామని మంత్రి హామీ ఇచ్చారు. గచ్చిబౌలిలోని టిమ్స్ ఆసుపత్రిని యుద్ధ ప్రాతిపదికన అందుబాటులోకి తీసుకురావాలని కిషన్ రెడ్డి చెప్పారు.

ఈ సందర్భంగా ఆస్పత్రి వద్ద కేంద్రమంత్రిని ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు కలిసి తమ మొర వినిపించుకున్నారు. తమ ఉద్యోగాలను రెగ్యులరైజ్ చేయాలని.. అలాగే వేతనాలు పెంచాలని కేంద్ర మంత్రికి ఉద్యోగులు వినతిపత్రం అందించారు. 14 ఏళ్ళుగా పనిచేస్తున్నా తమకు రూ.15 వేల జీతం మాత్రమే ఇస్తున్నారని, కొత్తగా వచ్చిన ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు రూ.29వేల వేతం ఇస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.


Tags :
|
|

Advertisement