Advertisement

  • డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల నిర్మాణంలో తెరాస పూర్తిగా విఫలం అయింది..కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి

డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల నిర్మాణంలో తెరాస పూర్తిగా విఫలం అయింది..కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి

By: Sankar Mon, 05 Oct 2020 12:22 PM

డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల నిర్మాణంలో తెరాస పూర్తిగా విఫలం అయింది..కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి


ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు లక్ష్మణ్ తో కలిసి ముషీరాబాద్ నియోజకవర్గంలోని డబుల్ బెడ్రూం ఇళ్ళను కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి పరిశీలించారు.

ఈ సందర్భంగా కిషన్ రెడ్డిని కలిసి ఇళ్ళ నిర్మాణంపై లబ్ధిదారులు అసంతృప్తిని వ్యక్తం చేసారు. అనంతరం కిషన్‌రెడ్డి మాట్లాడుతూ... రాష్ట్ర ప్రభుత్వం ఎన్ని లక్షల ఇళ్ళు కట్టినా కేంద్రం వాటాను తీసుకొచ్చే బాధ్యత నాదేనని హామీ ఇచ్చారు. డబుల్ బెడ్రూం ఇళ్ళ నిర్మాణంలో టీఆర్ఎస్ ప్రభుత్వం విఫలమైందని... 2015 లో శంకుస్థాపన చేసిన ఇంటి నిర్మాణాలు పూర్తికాకపోవటం ప్రభుత్వ చేతకాని తనమని ఫైర్‌ అయ్యారు.

ఎన్నికల‌ కోసం టీఆర్ఎస్ డబుల్ బెడ్రూం ఇళ్ళను వాడుకుంటోందని...కేంద్ర ప్రభుత్వం ఇళ్ళ కోసం ఇచ్చిన నిధులను పక్కదోవ పట్టించారని ఆరోపించారు. కేంద్ర నిధులతో ఆంద్రప్రదేశ్ లో 7లక్షల ఇండ్లు పూర్తి చేశారని...హైదరాబాద్ లో దాదాపు 20లక్షల మందికి పేదలకు ఇండ్లు లేవని గుర్తు చేశారు. అందరికీ ఇండ్లు నిర్మిస్తే కేంద్ర ప్రభుత్వం వాటా ఇచ్చేందుకు సిద్ధంగా ఉందన్నారు. డబుల్ బెడ్రూం ఇండ్లకు మౌలిక సదుపాయాలు యుద్ధ ప్రాతిపదికన పూర్తిచేయాలని పేర్కొన్నారు.

Tags :

Advertisement