రెండు జెళ్ల సీతగా కీర్తి సురేష్…
By: chandrasekar Mon, 30 Nov 2020 1:59 PM
తెలుగు ప్రేక్షకులను జంధ్యాల దర్శకత్వంలో రూపొందిన ‘రెండుజెళ్లసీత’ చిత్రం
చక్కటి హాస్యంతో అలరించింది. తాజాగా ఈ టైటిల్తో నవీన్విజయ్కృష్ణ, కీర్తిసురేష్
జంటగా ఓ సినిమా తీసారు రాంప్రసాద్ రగుతు దర్శకుడు. ఈ చిత్ర నిర్మాత చంటి అడ్డాల.
ప్రస్తుతం రీరికార్డింగ్ జరుగుతోంది. ఈ సందర్భంగా నిర్మాత చంటి అడ్డాల మాట్లాడుతూ
‘కథకు పక్కగా కుదరడంతోనే ఈ టైటిల్ పెట్టాం.
అలనాటి ‘రెండుజెళ్లసీత’లో
నరేష్ కథానాయకుడిగా నటిస్తే ఈ సినిమాలో ఆయన తనయుడు నవీన్ హీరోగా నటించడం విశేషం.
వినూత్న ప్రేమకథతో రూపొందిన ఈ చిత్రంలో నవీన్, కీర్తిసురేష్ మెప్పిస్తుంది. నాగబాబు, పోసాని కృష్ణమురళి, జబర్దస్త్ టీమ్ మధ్య
వచ్చే సన్నివేశాలు కడుపుబ్బా నవ్విస్తాయి. కథకు అదనంగా కొన్ని కొత్త సన్నివేశాల్ని
జతచేసే ఆలోచనలో ఉన్నాం’ అని పేర్కొన్నారు.