ఐపీఎల్-13లో వరుసగా ఐదో విజయాన్నందుకున్న కింగ్స్ ఎలెవన్ పంజాబ్...
By: chandrasekar Tue, 27 Oct 2020 03:12 AM
ఐపీఎల్-13లో
కేఎల్ రాహుల్ సారథ్యంలోని కింగ్స్
ఎలెవన్ పంజాబ్ సీజన్లో వరుసగా ఐదో
విజయాన్నందుకుంది. సోమవారం జరిగిన
మ్యాచ్లో కోల్కతా నైట్రైడర్స్పై 8 వికెట్ల తేడాతో గెలుపొందింది. విధ్వంసకర బ్యాట్స్మన్ క్రిస్గేల్(51: 29 బంతుల్లో 2ఫోర్లు, 5సిక్సర్లు), మన్దీప్ సింగ్(66 నాటౌట్: 56
బంతుల్లో 8ఫోర్లు, 2సిక్సర్లు) అర్ధశతకాలతో విజృంభించడంతో 18.5
ఓవర్లలోనే 2
వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని
ఛేదించింది. వీరిద్దరికి తోడుగా ఆరంభంలో కెప్టెన్ కేఎల్ రాహుల్(28) ఫర్వాలేదనిపించాడు.
పంజాబ్ను కట్టడి చేయడంలో కోల్కతా బౌలర్లు తేలిపోయారు.
గేల్, మన్దీప్
జోడీ రెండో వికెట్కు సరిగ్గా 100 పరుగులు జోడించారు. రాహుల్ ఔటైన తర్వాత క్రీజులోకి
వచ్చిన గేల్ బౌలర్లపై విరుచుకుపడి బౌండరీలు బాదేశాడు. ఈ క్రమంలోనే 25
బంతుల్లో అర్ధశతకం పూర్తి చేసుకున్నాడు. మరో ఎండ్ లో మన్దీప్ కూడా నిదానంగా
ఆడుతూ గేల్తో కలిసి విలువైన భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. అంతకుముందు శుభ్మన్
గిల్(57: 45 బంతుల్లో 3ఫోర్లు, 4సిక్సర్లు) అర్ధశతకానికి తోడు కెప్టెన్ ఇయాన్
మోర్గాన్ (40: 25 బంతుల్లో 5ఫోర్లు, 2సిక్సర్లు
) రాణించడంతో కోల్కతా
20
ఓవర్లలో 9
వికెట్లకు 149
పరుగులు చేసింది. పంజాబ్ బౌలర్లు
మహ్మద్ షమీ(3/35), రవి బిష్ణోయ్(2/20),
క్రిస్ జోర్డాన్(2/25) దెబ్బకు కోల్కతా
బ్యాట్స్మెన్ వరుస విరామాల్లో పెవిలియన్ చేరారు.