- హోమ్›
- వార్తలు›
- బ్యాక్ టు బ్యాక్ విజయాలతో అదరగొడుతోన్న కింగ్స్ ఎలెవన్ పంజాబ్... ఆరో ఓటమిని చవిచూసిన కోల్కతా
బ్యాక్ టు బ్యాక్ విజయాలతో అదరగొడుతోన్న కింగ్స్ ఎలెవన్ పంజాబ్... ఆరో ఓటమిని చవిచూసిన కోల్కతా
By: chandrasekar Tue, 27 Oct 2020 03:25 AM
ఐపీఎల్ 2020 సీజన్
ప్లేఆఫ్ ముంగిట కింగ్స్ ఎలెవన్ పంజాబ్ బ్యాక్ టు బ్యాక్ విజయాలతో అదరగొడుతోంది.
కోల్కతా నైట్రైడర్స్తో షార్జా వేదికగా సోమవారం రాత్రి జరిగిన మ్యాచ్లో క్రిస్గేల్
(51: 29 బంతుల్లో 2x4, 5x6), మన్దీప్ సింగ్ (66 నాటౌట్: 56 బంతుల్లో 8x4,
2x6) హాఫ్
సెంచరీలు బాదడంతో పంజాబ్ టీమ్ 8 వికెట్ల తేడాతో అలవోక విజయాన్ని అందుకుంది.
మ్యాచ్లో అంతకముందు
ఓపెనర్ శుభమన్ గిల్ (57: 45 బంతుల్లో 3x4,
4x6), కెప్టెన్ ఇయాన్ మోర్గాన్ (40: 25 బంతుల్లో 5x4, 2x6) మినహా కోల్కతా బ్యాట్స్మెన్లు తేలిపోవడంతో టాస్
ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన ఆ జట్టు 9 వికెట్ల నష్టానికి 149 పరుగులే చేయగలిగింది.
ఛేజింగ్ లో పంజాబ్
కెప్టెన్ కేఎల్ రాహుల్ (28: 25 బంతుల్లో 4x4)
తక్కువ స్కోరుకే ఔటైనా గేల్-మన్దీప్ జోడీ రెండో
వికెట్కి 100 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పి టీమ్ని గెలుపు బాట
పట్టించారు. పంజాబ్ టీమ్కి ఇది వరుసగా ఐదో గెలుపుకాగా 12
మ్యాచ్లాడి ఆరు విజయాలతో ఆ జట్టు పాయింట్ల పట్టికలో నాలుగో స్థానానికి చేరింది.
మరోవైపు 12వ
మ్యాచ్ ఆడి ఆరో ఓటమిని చవిచూసిన కోల్కతా ఐదో స్థానానికి పడిపోయింది.