Advertisement

  • బ్యాక్ టు బ్యాక్ విజయాలతో అదరగొడుతోన్న కింగ్స్ ఎలెవన్ పంజాబ్... ఆరో ఓటమిని చవిచూసిన కోల్‌కతా

బ్యాక్ టు బ్యాక్ విజయాలతో అదరగొడుతోన్న కింగ్స్ ఎలెవన్ పంజాబ్... ఆరో ఓటమిని చవిచూసిన కోల్‌కతా

By: chandrasekar Tue, 27 Oct 2020 03:25 AM

బ్యాక్ టు బ్యాక్ విజయాలతో అదరగొడుతోన్న కింగ్స్ ఎలెవన్ పంజాబ్... ఆరో ఓటమిని చవిచూసిన కోల్‌కతా


ఐపీఎల్ 2020 సీజన్‌ ప్లేఆఫ్ ముంగిట కింగ్స్ ఎలెవన్ పంజాబ్ బ్యాక్ టు బ్యాక్ విజయాలతో అదరగొడుతోంది. కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో షార్జా వేదికగా సోమవారం రాత్రి జరిగిన మ్యాచ్‌లో క్రిస్‌గేల్ (51: 29 బంతుల్లో 2x4, 5x6), మన్‌దీప్ సింగ్ (66 నాటౌట్: 56 బంతుల్లో 8x4, 2x6) హాఫ్ సెంచరీలు బాదడంతో పంజాబ్ టీమ్ 8 వికెట్ల తేడాతో అలవోక విజయాన్ని అందుకుంది.

మ్యాచ్‌లో అంతకముందు ఓపెనర్ శుభమన్ గిల్ (57: 45 బంతుల్లో 3x4, 4x6), కెప్టెన్ ఇయాన్ మోర్గాన్ (40: 25 బంతుల్లో 5x4, 2x6) మినహా కోల్‌కతా బ్యాట్స్‌మెన్‌లు తేలిపోవడంతో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన ఆ జట్టు 9 వికెట్ల నష్టానికి 149 పరుగులే చేయగలిగింది.

ఛేజింగ్ లో పంజాబ్ కెప్టెన్ కేఎల్ రాహుల్ (28: 25 బంతుల్లో 4x4) తక్కువ స్కోరుకే ఔటైనా గేల్-మన్‌దీప్ జోడీ రెండో వికెట్‌కి 100 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పి టీమ్‌ని గెలుపు బాట పట్టించారు. పంజాబ్ టీమ్‌కి ఇది వరుసగా ఐదో గెలుపుకాగా 12 మ్యాచ్‌లాడి ఆరు విజయాలతో ఆ జట్టు పాయింట్ల పట్టికలో నాలుగో స్థానానికి చేరింది. మరోవైపు 12వ మ్యాచ్ ఆడి ఆరో ఓటమిని చవిచూసిన కోల్‌కతా ఐదో స్థానానికి పడిపోయింది.

Tags :
|

Advertisement