- హోమ్›
- వార్తలు›
- ప్లే ఆఫ్ రేస్ లో నిలవాలంటే గెలవాల్సిందే ..కీలక పోరులో కేకేఆర్ తో తలపడనున్న కింగ్స్ ఎలెవన్ పంజాబ్
ప్లే ఆఫ్ రేస్ లో నిలవాలంటే గెలవాల్సిందే ..కీలక పోరులో కేకేఆర్ తో తలపడనున్న కింగ్స్ ఎలెవన్ పంజాబ్
By: Sankar Mon, 26 Oct 2020 3:38 PM
ఐపీఎల్ 2020 ప్లేఆఫ్ రేసులో నాలుగో బెర్త్ కోసం పోటీ తీవ్రంగా ఉన్న సంగతి తెలిసిందే. చెన్నై సూపర్ కింగ్స్ ప్లేఆఫ్ రేసు నుంచి నిష్క్రమించగా.. రాజస్థాన్, సన్రైజర్స్ సైతం పోటీలో వెనుకంజలోనే ఉన్నాయి. టాప్-4 నిలిచే అవకాశం ఎక్కువగా ఉన్న కోల్కతా నైట్ రైడర్స్, కింగ్స్ ఎలెవన్ పంజాబ్ మధ్య నేడు (అక్టోబర్ 26న) కీలక పోరు జరగనుంది.
ఈ మ్యాచ్లో కోల్కతా గెలిస్తే.. 14 పాయింట్లతో ప్లేఆఫ్ చేరే అవకాశాలు మరింత మెరుగవుతాయి.ఒకవేళ పంజాబ్ గెలిస్తే మాత్రం ప్లేఆఫ్ రేసు రసవత్తరంగా మారుతుంది. కోల్కతాపై గెలిస్తే.. పంజాబ్ ఖాతాలోనూ 12 పాయింట్లు చేరతాయి. కానీ నెట్ రన్ రేట్ అంతరంతో పంజాబ్ నాలుగో స్థానానికి చేరుకుంటుంది. వరుసగా 4 మ్యాచ్ల్లో గెలిచి ఊపు మీదున్న కింగ్స్ ఎలెవన్ ఈ మ్యాచ్లోనూ గెలిచిన ప్లేఆఫ్ అవకాశాలను మెరుగుపర్చుకోవాలని భావిస్తోంది.
ఇక షార్జా పిచ్ పేసర్లకు అనుకూలిస్తోంది. తేమ సైతం ప్రభావం చూపే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో టాస్ గెలిచిన జట్టు ముందుగా ఫీల్డింగ్ చేసే అవకాశం ఉంది. సన్రైజర్స్తో జరిగిన మ్యాచ్లో స్వల్ప లక్ష్యాన్ని కాపాడుకున్న పంజాబ్.. మరింత ఉత్సాహంతో ఈ మ్యాచ్లో బరిలో దిగనుంది.