Advertisement

  • ఆరోగ్యశ్రీ ప‌రిధిలోకి కిడ్నీ,హార్ట్, లివ‌ర్ ట్రాన్స్‌ప్లాంటేష‌న్..పేద‌ల‌పై రూపాయి భారం ప‌డ‌కుండా ఉచిత వైద్యం

ఆరోగ్యశ్రీ ప‌రిధిలోకి కిడ్నీ,హార్ట్, లివ‌ర్ ట్రాన్స్‌ప్లాంటేష‌న్..పేద‌ల‌పై రూపాయి భారం ప‌డ‌కుండా ఉచిత వైద్యం

By: chandrasekar Fri, 09 Oct 2020 12:26 PM

ఆరోగ్యశ్రీ ప‌రిధిలోకి కిడ్నీ,హార్ట్, లివ‌ర్ ట్రాన్స్‌ప్లాంటేష‌న్..పేద‌ల‌పై రూపాయి భారం ప‌డ‌కుండా ఉచిత వైద్యం


న‌గ‌రంలోని మ‌ర్రి చెన్నారెడ్డి మాన‌వ వ‌న‌రుల కేంద్రంలో వైద్యారోగ్య శాఖ బ‌లోపేతానికి సీఎం కేసీఆర్ నియ‌మించిన కేబినెట్ స‌బ్ క‌మిటీ స‌మావేశంలో వైద్యారోగ్య శాఖ మంత్రి ఈట‌ల రాజేంద‌ర్ మాట్లాడుడ్తూ.. ఆరోగ్య శ్రీ ప‌రిధిలోకి కిడ్నీ, హార్ట్, లివ‌ర్ ట్రాన్స్‌ప్లాంటేష‌న్‌ను తీసుకురావాల‌ని మంత్రివ‌ర్గ ఉప‌సంఘం నిర్ణ‌యం తీసుకుంద‌ని తెలిపారు. ప్ర‌స్తుతం కేవ‌లం నిమ్స్, గాంధీ, ఉస్మానియా ఆస్ప‌త్రుల్లోనే మూత్ర‌పిండాలు, గుండె, కాలేయ మార్పిడి శ‌స్ర్త‌చికిత్స‌లు కొన‌సాగుతున్నాయ‌ని, వీటిని మెడిక‌ల్ కాలేజీల అనుబంధ ఆస్ప‌త్రుల‌కు విస్త‌రింప‌జేస్తామ‌ని మంత్రి పేర్కొన్నారు. కిడ్నీ, హార్ట్ ట్రాన్స్‌ప్లాంటేష‌న్‌కు రూ. 30 ల‌క్ష‌ల నుంచి రూ. 40 ల‌క్ష‌ల ఖ‌ర్చు అవుతుంద‌ని ఇది పేద‌ల‌కు భారంగా మారింద‌న్నారు. ఈ క్ర‌మంలో ఈ మూడింటిని ఆరోగ్య శ్రీ ప‌రిధిలోకి చేర్చి పేద‌ల‌పై రూపాయి భారం ప‌డ‌కుండా ఉచిత వైద్యం అందిస్తామ‌న్నారు. ఈ ప్ర‌తిపాద‌న‌కు సంబంధించి అవ‌స‌ర‌మైతే చ‌ట్టంలో కూడా మార్పులు చేస్తామ‌న్నారు. న‌గ‌రంలోని మ‌ర్రి చెన్నారెడ్డి మాన‌వ వ‌న‌రుల కేంద్రంలో వైద్యారోగ్య శాఖ బ‌లోపేతానికి సీఎం కేసీఆర్ నియ‌మించిన కేబినెట్ స‌బ్ క‌మిటీ భేటీ అయింది. ఈ స‌మావేశంలో మంత్రులు ఈట‌ల రాజేంద‌ర్‌, కేటీఆర్, త‌ల‌సాని శ్రీనివాస్ యాద‌వ్‌, ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర్‌రావుతో పాటు సంబంధిత అధికారులు పాల్గొని ప‌లు అంశాల‌పై చ‌ర్చించారు. ప‌లు ప్ర‌తిపాద‌న‌ల‌కు కేబినెట్ స‌బ్ క‌మిటీ ఆమోదం తెలిపింది. ఈ నివేదిక‌ను సీఎం కేసీఆర్‌కు వైద్యారోగ్య శాఖ మంత్రి ఈట‌ల రాజేంద‌ర్ అంద‌జేయ‌నున్నారు.

మంత్రివ‌ర్గ ఉప‌సంఘం ముగిసిన అనంత‌రం మంత్రి ఈట‌ల రాజేంద‌ర్ మీడియాతో మాట్లాడారు. తెలంగాణ రాష్ర్టం ఏర్ప‌డిన త‌ర్వాత వైద్యారోగ్య శాఖ‌లో అనేక సంస్క‌ర‌ణ‌లు తెచ్చామ‌ని తెలిపారు. తెలంగాణ వ‌చ్చే నాటికి మాతా శిశుమ‌ర‌ణాల రేటు 92 ఉంటే, ప్ర‌స్తుతం 63కు త‌గ్గింద‌న్నారు. ప్ర‌జ‌ల‌కు మేలైన వైద్యం అందిస్తున్న రాష్ర్టాల్లో కేర‌ళ‌, త‌మిళ‌నాడు మొదటి, రెండు స్థానాల్లో నిల‌వ‌గా తెలంగాణ మూడో స్థానంలో నిలిచింద‌ని గుర్తు చేశారు. ప్ర‌భుత్వ ఆస్ప‌త్రుల్లో మెరుగైన వైద్య సేవ‌లు అందించేందుకు తీసుకోవాల్సిన చ‌ర్య‌ల‌పై చ‌ర్చించామ‌న్నారు. అన్ని పీహెచ్‌సీల‌ను బ‌లోపేతం చేస్తున్నామ‌ని, ప్ర‌తి ఆస్ప‌త్రిలో సీటీ స్కాన్, ఎంఆర్ఐతో పాటు ఎక్స్ రే సౌక‌ర్యాలు క‌ల్పించేలా చ‌ర్య‌లు తీసుకుంటామ‌న్నారు. క్యాన్స‌ర్ రోగుల కోసం ఎంఎన్‌జే క్యాన్స‌ర్ ఆస్ప‌త్రిని అభివృద్ధి చేస్తున్నామ‌ని తెలిపారు.

హాస్పిటల్స్...

న‌గ‌రంలో బ‌స్తీ హాస్పిటల్స్... విజ‌య‌వంతంగా ప‌ని చేస్తున్నాయ‌ని మంత్రి ఈట‌ల రాజేంద‌ర్ స్ప‌ష్టం చేశారు. మొత్తం 300ల బ‌స్తీ హాస్పిటల్స్ ఏర్పాటుకు సీఎం కేసీఆర్ ఆదేశాలు జారీ చేయ‌గా, ఇప్ప‌టికే 198 బ‌స్తీ హాస్పిటల్స్ ‌ ప్రారంభించామ‌న్నారు. మ‌రో 26 హాస్పిటల్స్ ఈ నెల‌లో ప్రారంభిస్తామ‌ని తెలిపారు. బ‌స్తీ హాస్పిటల్స్ ల్లో మెరుగైన వైద్య సేవ‌లు అంద‌డం ప‌ట్ల ప్ర‌జ‌లు సంతృప్తిగా ఉన్నార‌ని మంత్రి తెలిపారు. 108 అంబులెన్స్‌ల నిర్వ‌హ‌ణ మొత్తం ప్ర‌భుత్వ ఖ‌ర్చుతోనే కొన‌సాగుతుంద‌న్నారు. ప్ర‌తి మండ‌లానికి 108 అంబులెన్స్‌ల‌ను స‌మ‌కూర్చుతామ‌ని మంత్రి ఈట‌ల రాజేంద‌ర్ స్ప‌ష్టం చేశారు.

Tags :
|
|

Advertisement