Advertisement

ఖుష్బుకు కంటి ఫై సర్జరీ

By: chandrasekar Wed, 19 Aug 2020 5:33 PM

ఖుష్బుకు కంటి ఫై సర్జరీ


ఖుష్బూ సుందర్ కొన్ని రోజులుగా ఈమె సినిమాలతో పాటు రాజకీయాలతో కూడా బిజీగా ఉంది. అక్కడా ఇక్కడా తన సత్తా చూపిస్తూనే ఉంది. ఆ మధ్య తెలుగులో పవన్ హీరోగా వచ్చిన అజ్ఞాతవాసిలో కూడా అమ్మగా నటించింది. ఈ సినిమా తర్వాత మళ్లీ తెలుగులో కనిపించలేదు ఖుష్బూ. కానీ తమిళం లో మాత్రం బిజీగా ఉంది. అయితే ఇప్పుడు ఉన్నట్లుండి ఈమెకు చిన్న ఆరోగ్య సమస్య వచ్చింది.

కుడి కంటిరెప్పపై ఓ కణిత రావడంతో వెంటనే ఈమె సర్జరీ చేయించుకుంది. దాంతో కొన్ని రోజులు సోషల్ మీడియాకు దూరంగా ఉంటున్నట్లు ప్రకటించింది ఖుష్బూ. అంతా బాగుండాలని మాస్కులు ధరించాలని కోరుకుంది. త్వరలోనే మళ్లీ మీ ముందుకు వస్తానంటూ ట్వీట్ చేసింది ఖుష్బూ. ఓ వారం రోజుల పాటు తను ట్విట్టర్‌తో పాటు వాట్సాప్ కూడా వాడదలుచుకోలేదని మీ ఆశీర్వాదాలు కావాలంటూ కోరుకుంది.

Tags :
|

Advertisement