కాంగ్రెస్ పార్టీకి షాకిచ్చిన నటి ఖుష్బూ...బీజేపీ పార్టీలోకి...
By: chandrasekar Mon, 12 Oct 2020 6:07 PM
సోమవారం (అక్టోబర్ 12) దేశ
రాజధాని ఢిల్లీలోని బీజేపీ ప్రధాన కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో పలువురు
బీజేపీ నేతల సమక్షంలో కుష్బూ సుందర్ బీజీపీలో చేరారు. బీజేపీ నేత సంబిత్ పాత్రా
కుష్బూకు కాషాయం కండువా కప్పి పార్టీ అభ్యర్థిత్వాన్ని అందించారు. సినీ నటిగా
గుర్తింపు సాధించిన కుష్బూ సుమారు ఆరేళ్లుగా కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. పార్టీలో కీలక పదవులు అనుభవించారు. అయితే ఇటీవల ఆమెను ఏఐసీసీ ప్రతినిధి హోదా నుంచి తప్పించారు.
2019 లోక్సభ
ఎన్నికల్లోనూ ఆమెకు కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇవ్వలేదు. ఈ అంశాలతో ఆమె
మనస్తాపానికి గురై కాంగ్రెస్ పార్టీకి గుడ్బై చెప్పినట్లు తెలుస్తోంది.
కాంగ్రెస్ పార్టీలో
ఉన్నత స్థాయిలో ఉన్న కొందరు నేతలు
క్షేత్ర స్థాయిలో పరిస్థితుల గురించి తెలియకుండానే ఆదేశాలు ఇస్తున్నారని
ఇది నచ్చకనే కాంగ్రెస్ పార్టీని వీడుతున్నట్లు ఖుష్బూ సుందర్ పేర్కొన్నారు. ఈ
మేరకు తన రాజీనామా లేఖలో పేర్కొన్నారు. 2010లో డీఎంకే అధికారంలో ఉన్న సమయంలో ఖుష్బూ ఆ పార్టీ
కోసం పని చేశారు. ఆ తర్వాత నాలుగేళ్లకే ఆ పార్టీని వీడి సోనియా గాంధీ సమక్షంలో
కాంగ్రెస్ పార్టీలో చేరారు. మరోవైపు కుష్బూ రాకతో తమిళనాడులో బీజేపీ మరింత
బలోపేతం అవుతుందని నేతలు అభిప్రాయ౦. రాబోయే తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో ఆమె
కీలక స్థానం నుంచి పోటీ చేస్తారని రాష్ట్రంలో బీజేపీ ముఖచిత్రాన్ని మార్చేస్తారని
అంటున్నారు. కుష్బూ ప్రభావం ఏ మేరకు ఉంటుందో వేచి చూడాలి మరి!