Advertisement

సైజు తగ్గిన ఖైరతాబాద్ వినాయకుడు

By: Sankar Thu, 02 July 2020 7:25 PM

సైజు తగ్గిన ఖైరతాబాద్ వినాయకుడు



హైదరాబాద్లో గణేష్ నవరాత్రి వేడుకలు అంటే అందరికి గుర్తొచ్చేది ఖైరతాబాద్ వినాయకుడు ..ప్రతి సంవత్సరం అత్యంత శోభాయమానంగా ఈ వేడుకలు జరుపుకుంటారు ..ఈ వేడుకల్లో అత్యంత ప్రత్యేకమైనది వినాయకుడి విగ్రహం ..అత్యంత ఎత్తులో అందమైన రూపంతో చూడటానికి రెండు కన్నులు చాలవు అనేలా ఉంటుంది ..కేవలం హైదరాబాద్ నుంచే కాకుండా దేశం మొత్తం నుంచి ఈ వినాయకుడిని చూసేందుకు భక్తులు వస్తారు ..అయితే హైద్రాబాద్లో కరోనా తీవ్రత ఉగ్రరూపం దాల్చడంతో ఈ సారి ఈ వినాయకుడి వేడుకల మీద కూడా పడింది ..

కరోనా నేపథ్యంలో ఈ సారి 27 అడుగుల ఎత్తులో మట్టి వినాయకున్ని ప్రతిష్టంచనున్నట్టు ఖైరతాబాద్ గణేష్ ఉత్సవ కమిటీ తెలిపింది. ధన్వంతరి రూపంలో ఈ ఏడాది ఖైరతాబాద్‌ వినాయకుడు దర్శనం ఇవ్వనున్నట్టుగా కమిటీ సభ్యులు చెప్పారు. ఒక చేతిలో అమృతం, మరో చేతిలో ఆయుర్వేదంతో గణేషుడు కనిపించనున్నారు .ప్రతి ఏడాదిలాగే శిల్పి రాజేందర్‌ వినాయకుడి విగ్రహాన్ని రూపొందించనున్నారు.

కరోనా వ్యాక్సిన్‌ను త్వరగా వచ్చేలా చేయాలని భగవంతుడి ఆశీస్సులు కోరుతూ ఈ ఏడాది ధన్వంతరి వినాయకుడిని ప్రతిష్టనుంచనున్నట్టు కమిటీ సభ్యులు వెల్లడించారు. విగ్రహం తయారుచేయడానికి కావాల్సిన మట్టిని గుజరాత్‌ నుంచి తెప్పించనున్నట్టుగా తెలిపారు. అయితే ఈ సారి ఖైరతాబాద్ వినాయకుడిని హుస్సేన్‌ సాగర్‌లో నిమజ్జనం చేయబోమని చెప్పారు. ఉన్న స్థలంలోనే పలు ద్రవాలతో అభిషేకం నిర్వహించి నిమజ్జన ప్రక్రియ పూర్తిచేయనున్నట్టుగా పేర్కొన్నారు.

కాగా, కరోనా పరిస్థితుల నేపథ్యంలో ఈ ఏడాది ఒక్క అడుగు ఎత్తులోనే ఖైరతాబాద్‌ వినాయకుడి విగ్రహం తయారుచేయాలని తొలుత భావించారు. అయితే భక్తుల నుంచి వచ్చిన విజ్ఞప్తిల మేరకు తాజాగా 27 అడుగుల ఎత్తులో వినాయకుడి విగ్రహం ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకున్నారు.

Tags :
|

Advertisement