కేజీ చేపలు రూ.10కే...!
By: chandrasekar Fri, 04 Sept 2020 9:48 PM
ఆకువీడు మార్కెట్లో అంత తక్కువ ధరకు చేపలు ఇస్తున్నా కొనేవాళ్లు లేరట. దీని వెనుక ఓ కారణం ఉందట. పశ్చిమగోదావరి జిల్లా ఆకువీడు మార్కెట్లో కిలో చేపల ధర పది రూపాయలకు పడి పోయింది. ఆకువీడు పరిసర చెరువుల్లో సుమారు 40
టన్నుల చేపలు పైకి తేలాయి.
వాతావరణంలో మార్పులు రావడంతో చేపలు ఆక్సిజన్ అందక పైకి తేలాయట. వెంటనే ఆ చేపల్ని ఆకువీడు మార్కెట్కు తరలించారు. ఆక్సిజన్ అందక పైకి తేలిన చేపలు కావడంతో రూ.10కి కిలో చొప్పున అమ్మేందుకు సిద్ధపడ్డారు. కానీ జనాలు మాత్రం కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపించలేదట.
రూ.10కే కిలో చేపలన్నా ఒక్కరు ముందుకు రాలేదట. బయట మార్కెట్లో కిలో రూ.100 పలుకుతున్నచేపల ధర ఇక్కడ మాత్రం రూ.10కే కిలో. దీంతో మార్కెట్కు తీసుకొచ్చిన చేపల్ని మళ్లీ వెనక్కు తీసుకెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది. పాపం చేపల చెరువులు వేసిన రైతులకు భారీ నష్టం కలిగింది.