కెఎఫ్సీ చికెన్ వండిన మెగాస్టార్
By: chandrasekar Mon, 02 Nov 2020 09:55 AM
మెగాస్టార్ చిరంజీవి
కెఎఫ్సీ చికెన్ వండిన వీడియో వైరల్ గా మారింది. లాక్డౌన్కు ముందు వరస సినిమాలతో
బిజీగా ఉన్న మెగాస్టార్ చిరంజీవి కరోనా వైరస్ వచ్చిన తర్వాత పూర్తిగా ఫ్రీ
అయిపోయాడు. ఇంటి నుంచి బయటికి కూడా వెళ్లడం లేదు. దాంతో ఇంట్లోనే ఉండి తన వాళ్ల
కోసం వంటలు చేసి పెడుతున్నాడు. పైగా ఈ మధ్యే సోషల్ మీడియాలోకి కూడా రావడంతో తనకు
వచ్చిన వంటలను అభిమానులతో కూడా పంచుకుంటున్నాడు. ఇదివరకే అమ్మ కోసం దోశలు వేసిన
చిరు ప్రస్తుతం తన మనవరాళ్ల కోసం ఏకంగా కెఎఫ్సీ చికెన్ ఇంట్లోనే చేసి పెట్టాడు.
దీనికి సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేసాడు. ఆదివారం కదా బోర్
కొడుతుంది ఏం చేద్దాం అంటూ మనవరాళ్ళతో కూర్చుని మాట్లాడుతూ వీడియో మొదలు పెట్టాడు
చిరు. అందులో సుష్మిత కూతురు, శ్రీజ పెద్ద కూతురు ఉన్నారు. అందులో సుష్మిత కూతురు
బయటి నుంచి కెఎఫ్సీ చికెన్ తెచ్చుకుందాం అంటే కోవిడ్ టైమ్లో బయటి నుంచి వద్దన్న
చిరంజీవి ఇంట్లోనే చేసుకుందాం అంటూ వంట మొదలు పెట్టారు.
అసలు ఈ చికెన్ కోసం ఏమేం
కావాలి ఎలా సిద్ధం చేయాలి అంటూ 4 నిమిషాలకు పైగా వీడియో పోస్ట్ చేసారు. ఇది చూసిన
తర్వాత చిరు వంటల్లో ఎంత పర్ఫెక్ట్ అయిపోయాడు అనేది అర్థమవుతుంది. నోరూరించే కెఎఫ్సీ
చికెన్ చేసి తన ముద్దుల మనవరాళ్లకు తినిపించాడు చిరంజీవి. ప్రస్తుతం ఈ వీడియో
అయితే వైరల్ అవుతుంది. ఇక సినిమాల విషయానికి వస్తే ప్రస్తుతం కొరటాల శివ
దర్శకత్వంలో ఆచార్య సినిమా చేస్తున్నాడు. ఈ చిత్ర షూటింగ్ డిసెంబర్ నుంచి మళ్లీ
మొదలు కానుంది. ఇందులో హీరోయిన్గా నటిస్తున్న కాజల్ పెళ్లి కూడా కావడంతో కొన్ని
రోజులు బ్రేక్ తీసుకుంటున్నారు. మరోవైపు ఆచార్య తర్వాత మెహర్ రమేష్తో వేదాళం
రీమేక్ వినాయక్తో లూసీఫర్ రీమేక్లను ప్రారంభించనున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం
ఫ్రీగా వుండడంతో కుటుంబంతో కలసి బాగా ఎంజాయ్ చేస్తున్నట్లు తెలుస్తుంది.