Advertisement

ఆంధ్ర ప్రదేశ్ కేబినెట్ భేటీలో కీలక నిర్ణయాలు

By: chandrasekar Wed, 19 Aug 2020 5:35 PM

ఆంధ్ర ప్రదేశ్ కేబినెట్ భేటీలో కీలక నిర్ణయాలు


ఏపీ కేబినెట్ భేటీలో సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఎన్నికలకు ముందు డ్వాక్రా మహిళలకు హామీ ఇచ్చిన విధంగా వారు తీసుకున్న రుణాలను నాలుగు విడతల్లో మాఫీ చేయాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకు సంబంధించిన వైఎస్ఆర్ ఆసరా పథకాన్నిసెప్టెంబర్ 11న ప్రారంభించాలని మంత్రివర్గం తీర్మానించింది.

రాబోయే నాలుగేళ్లలో ఆసరా పథకం ద్వారా ఆంధ్ర ప్రదేశ్ లోని లక్షల మంది డ్వాక్రా మహిళలు 27 వేల కోట్ల రూపాయల మేర లబ్ది పొందనున్నట్టు తెలుస్తోంది. మరోవైపు సెప్టెంబర్ 1న వైఎస్ఆర్ సంపూర్ణ పోషణ పథకాన్ని ప్రారంభించబోతున్నారు. ఈ పథకానికి కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న వైఎస్ఆర్ విద్యాకానుక పథకాన్ని మంత్రివర్గం ఆమోదించింది. సెప్టెంబర్ 5న ఈ పథకాన్నిప్రభుత్వం ప్రారంభించబోతుంది. చేందుకు ఇప్పటికే

డిసెంబర్ నుంచి ఇంటింటికీ రేషన్ అమలు చేయాలనే నిర్ణయానికి కేబినెట్ ఆమోదం లభించింది. ఇక బీసీ కార్పొరేషన్‌ ఏర్పాటుతో పంచాయతీరాజ్ శాఖలో 51 డివిజనల్ డెవలప్‌మెంట్ అధికారుల పోస్టులకు ఏపీ మంత్రివర్గం పచ్చజెండా ఊపింది. మరోవైపు ఈ నెల 25 జలవివాదాలపై జరగనున్న అపెక్స్ కౌన్సిల్ సమావేశం అంశం కూడా కేబినెట్‌లో చర్చ జరిగింది.

Tags :
|

Advertisement