కేరళ లో తీవ్రంగా విజృంభిస్తున్న కరోనా ...తాజాగా 28 కరోనా మరణాలు
By: Sankar Wed, 02 Dec 2020 10:01 PM
కేరళలో కరోనా తీవ్రత కొనసాగుతూనే ఉన్నది. మంగళవారం నుంచి బుధవారం వరకు గత 24 గంటల్లో 6,316 కరోనా కేసులు, 28 మరణాలు నమోదయ్యాయి.
దీంతో ఆ రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 6,14,673కు, మొత్తం మరణాల సంఖ్య 2298కి చేరింది. గత 24 గంటల్లో 5,924 మంది కరోనా రోగులు కోలుకున్నారు. దీంతో కేరళలో కరోనా నుంచి కోలుకున్నవారి సంఖ్య 5,50,788కి చేరినట్లు ఆ రాష్ట్ర ఆరోగ్య శాఖ తెలిపింది. ప్రస్తుతం 61,455 యాక్టివ్ కేసులున్నట్లు పేర్కొంది.
ఇక తెలంగాణాలో గడిచిన 24 గంటల్లో కొత్తగా 565 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 2,70,883కు చేరింది. ఈ మేరకు తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ బుధవారం కరోనా హెల్త్ బులిటెన్ విడుదల చేసింది. గడిచిన 24గంటల్లో కరోనా నుంచి కోలుకున్నవారి సంఖ్య 925 కాగా, వివిధ ఆస్పత్రుల నుంచి కోలుకొని డిశ్చార్జ్ అయినవారి మొత్తం సంఖ్య 2,60,155గా నమోదైంది