Advertisement

  • వ్యవసాయ చట్టాలపై సుప్రీంకోర్టు కు వెళ్తాము...కేరళ ప్రభుత్వం

వ్యవసాయ చట్టాలపై సుప్రీంకోర్టు కు వెళ్తాము...కేరళ ప్రభుత్వం

By: Sankar Tue, 08 Dec 2020 11:18 AM

వ్యవసాయ చట్టాలపై సుప్రీంకోర్టు కు వెళ్తాము...కేరళ ప్రభుత్వం


కేంద్రం తీసుకువచ్చిన వివాదాస్పద వ్యవసాయ చట్టాలపై సుప్రీం కోర్టును ఆశ్రయిస్తామని కేరళ వ్యవసాయశాఖ మంత్రి వీఎస్‌ సునీల్‌కుమార్‌ తెలిపారు.

రాష్ట్రంలో చట్టాలను అమలు చేయమని, కేంద్రం ప్రభుత్వం తీసుకునే ఏ చర్యలకైనా కేరళ ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. చట్టాలకు వ్యతిరేకంగా ఈ వారంలోనే సుప్రీం కోర్టుకు వెళ్లనున్నట్లు తెలిపారు. కేంద్రం చర్య రాష్ట్ర ప్రభుత్వాల అధికారాన్ని స్వాధీనం చేసుకోవడంతో సమానమని, ఇది రాజ్యాంగ విరుద్ధమన్నారు.

దేశ ఆహార భద్రతా స్వాతంత్య్రాన్ని కొత్త చట్టాలు హరించి కార్పొరేట్‌ సంస్థలకు అప్పగించబడుతాయన్నారు. అలాగే ప్రజా పంపిణీ వ్యవస్థను నాశనం చేస్తుందని మంత్రి అన్నారు.

Tags :
|

Advertisement