ఫుట్ బాల్ దిగ్గజం మారడోనా మ్యూజియం ఇండియాలో ...
By: Sankar Tue, 08 Dec 2020 1:10 PM
ఈ మధ్యే కన్నుమూసిన ఫుట్బాల్ లెజెండ్ డీగో మారడోనా పేరిట ఇండియాలో ఓ మ్యూజియం ఏర్పాటు కాబోతోంది. ఈ లెజెండరీ ప్లేయర్ను 2012లో కేరళకు తీసుకొచ్చిన అక్కడి వ్యాపారవేత్త, చెమ్మనూరు గ్రూప్ చైర్మన్ బాబీ చెమ్మనూర్ ఈ మ్యూజియం ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు.
ఇందులో మారడోనా పసిడి విగ్రహంతోపాటు అతనికి సంబంధించిన మరిన్ని జ్ఞాపకాలు కొలువుదీరనున్నాయి. అయితే ఈ మ్యూజియం ఎక్కడ ఏర్పాటు చేస్తారన్నదానిపై ఇంకా స్పష్టత లేదు. కోల్కతా లేదా కేరళలోని ఓ నగరంలో ఉంటుందని మాత్రం బాబీ వెల్లడించారు. ఈ మ్యూజియానికి హ్యాండ్ ఆఫ్ గాడ్ అని పేరు పెట్టనున్నట్లు చెప్పారు.
ఇందులో మారడోనా వ్యక్తిగత, ప్రొఫెషనల్ జీవితాలకు సంబంధించిన అరుదైన జ్ఞాపకాలు ఉంటాయని, పసిడితో చేసిన విగ్రహం ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుందని ఆయన తెలిపారు. సాంప్రదాయ, ఆధునికతల కలబోతగా ఈ మ్యూజియం ఉంటుందని చెప్పారు