Advertisement

  • ఢిల్లీలో మరోసారి లాక్‌డౌన్ విధించే ఆలోచన లేదు: కేజ్రీవాల్ స్పష్టం

ఢిల్లీలో మరోసారి లాక్‌డౌన్ విధించే ఆలోచన లేదు: కేజ్రీవాల్ స్పష్టం

By: chandrasekar Tue, 16 June 2020 4:16 PM

ఢిల్లీలో మరోసారి లాక్‌డౌన్ విధించే ఆలోచన లేదు: కేజ్రీవాల్ స్పష్టం


దేశ రాజధాని ఢిల్లీలో కరోనా మహమ్మారి విజృంభిస్తున్న నేపథ్యంలో మరోసారి పూర్తిస్థాయి లాక్‌డౌన్ విధిస్తారని సోషల్ మీడియాలో జరుగుతోన్న ప్రచారంపై ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ స్పందించారు. మరోసారి లాక్‌డౌన్ విధించే ఆలోచన లేదని ఈ మేరకు ఆయన ట్విట్టర్ ద్వారా స్పష్టం చేశారు. ఢిల్లీలో కరోనా మహమ్మారి విజృంభపై అఖిలపక్ష సమావేశం జరిగిన కొద్దిసేపటికే కేజ్రీవాల్ ఈ విషయాన్ని ట్విటర్‌లో వెల్లడించారు. ఢిల్లీలో ఇప్పటివరకు 41,182 పాజిటివ్‌ కేసులు నమోదు కాగా 1327మంది ప్రాణాలు కోల్పోయారు. దేశంలోనే అత్యధికంగా కరోనా కేసులు నమోదైన రాష్ట్రాల్లో ప్రస్తుతం ఢిల్లీ మూడో స్థానంలో ఉంది.

ఢిల్లీలో కరోనా వైరస్ పరిస్థితిపై నార్త్‌ బ్లాక్‌లో కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా అధ్యక్షతన జరిగిన అఖిలపక్ష సమావేశంలో ఆప్‌, బీజేపీ, కాంగ్రెస్‌, బీఎస్పీ, సమాజ్‌వాదీ పార్టీ (ఎస్పీ)లకు చెందిన నేతలు పాల్గొన్నారు. కరోనా వ్యాప్తి, నియంత్రణకు చేపట్టాల్సిన చర్యలపై సమీక్షించారు. ఈ సమావేశంలో దాదాపు అందరూ కరోనా పరీక్షల సంఖ్యను పెంచాలని అభిప్రాయం వ్యక్తం చేశారు. ఢిల్లీలో కరోనా వైరస్‌ విజృంభిస్తున్న వేళ త్వరలోనే కోవిడ్ నిర్ధారణకు కొత్త పరీక్ష విధానం వినియోగిస్తామని ఆప్‌ నేత సంజయ్‌ సింగ్‌ అన్నారు. అఖిలపక్ష సమావేశం అనంతరం ఆయన మాట్లాడుతూ 15 నిమిషాల్లోనే నిర్వహించే ఈ కొత్త పరీక్షను కేవలం రూ.450లకే అందుబాటులోకి తెస్తున్నట్టు తెలిపారు. జూన్‌ 20 నుంచి ఢిల్లీలో రోజూ 18వేల మందికి పరీక్షలు చేస్తామని ఆయన తెలిపారు.


kejriwal,no intention,imposing,lockdown,delhi once again ,ఢిల్లీలో, మరోసారి, లాక్‌డౌన్ విధించే, ఆలోచన లేదు, కేజ్రీవాల్ స్పష్టం


కరోనా వైరస్ నేపథ్యంలో దేశ రాజధాని ఢిల్లీ సహా పలు రాష్ట్రాల్లో పరిస్థితులు భయానకంగా ఉన్నాయని సుప్రీంకోర్టు శుక్రవారం తీవ్ర అసహనం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. కరోనా బాధితులకు చికిత్స, మృతదేహాలకు అంత్యక్రియల నిర్వహణ తీరుపై మీడియాలో వస్తున్న కథనాలను సుమోటాగా స్వీకరించిన సర్వోన్నత న్యాయస్థానం విచారణ చేపట్టింది. ఈ విచారణ సందర్భంగా ఢిల్లీ హాస్పిటల్స్‌లో కరోనా వైరస్ రోగుల పట్ల వ్యవహరిస్తున్న తీరుపై మండిపడింది.

కరోనా రోగుల పట్ల జంతువుల కన్నా దారుణంగా వ్యవహరిస్తున్నారనీ ఆస్పత్రుల్లో మృతదేహాల నిర్వహణ సరిగ్గా లేదని ఆగ్రహం వ్యక్తం చేసింది. చెత్తకుప్పలో మృతదేహాలు కనబడటం వంటి దృశ్యాలు తీవ్ర ఆందోళన కల్గిస్తున్నాయని ఆవేదన వ్యక్తంచేశారు. ఆస్పత్రుల్లో కరోనా మృతదేహాలను భద్రపరచడంలో సరైన జాగ్రత్తలు తీసుకోవడంలేదని న్యాయస్థానం అసంతృప్తి వ్యక్తంచేసింది.

Tags :

Advertisement