Advertisement

  • కోటి లంచం తీసుకుంటూ దొరికిన కీసర మాజీ ఎమ్మార్వో జైలులో ఆత్మహత్య

కోటి లంచం తీసుకుంటూ దొరికిన కీసర మాజీ ఎమ్మార్వో జైలులో ఆత్మహత్య

By: Sankar Wed, 14 Oct 2020 11:21 AM

కోటి లంచం తీసుకుంటూ దొరికిన కీసర మాజీ ఎమ్మార్వో జైలులో ఆత్మహత్య


కీసర మాజీ తహశీల్దార్ నాగరాజు చంచల్ గూడ జైల్లో ఆత్మహత్య చేసుకున్నాడు. గతంలో కోటి పదిలక్షల రూపాయల లంచం డిమాండ్ చేసి ఏసీబీ అధికారులకు దొరికిపోయాడు.

ఈ కేసులో నాగరాజును అరెస్ట్ చేసి చంచల్ గూడ జైలుకు పంపారు. ఏసీబీ అధికారులు ఆయనపై రెండో కేసును కూడా నమోదు చేశారు. దయారా గ్రామంలో 48 ఎకరాల విలువైన భూమికి నకిలీ పత్రాలు సృష్టించి మ్యుటేషన్ చేసినట్టు ఆయనపై ఆరోపణలు ఉన్నాయి. ఈ కేసులో ఏసీబీ అధికారులు మాజీ ఎమ్మార్వో తో పాటుగా 9 మందిని నిందితులుగా చేర్చారు. మాజీ తహశీల్దార్ ఇప్పటికే చంచల్ గూడ జైలులో ఉన్నారు.

ఈ కేసుల్లో నిందితులు బెయిల్ కోసం కోర్టును ఆశ్రయించారు. అయితే, మాజీ తహశీల్దార్ నాగరాజుకు బెయిల్ ఇచ్చేందుకు ఏసీబీ కోర్టు నిరాకరించింది. కేసులో ప్రధాన నిందితుడిగా ఉండటంతో ఆయనకు బెయిల్ ఇచ్చేందుకు కోర్టు నిరాకరించింది.

Tags :
|

Advertisement