BJP నాయకులపై ధ్వజమెత్తిన కేసీఆర్...రుజువు చేస్తే రాజీనామా చేస్తా
By: chandrasekar Sat, 31 Oct 2020 5:04 PM
ముఖ్యమంత్రి కేసీఆర్
బీజేపీ నాయకులపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. పెన్షన్ల విషయంలో బీజేపీ నాయకులు
చేస్తున్న అసత్య ప్రచారాలను సీఎం మండిపడ్డారు. బీజేపీ నాయకులు పచ్చి అబద్ధాలు
మాట్లాడుతున్నారు. పెన్షన్లకు కేంద్రం అధిక మొత్తంలో డబ్బులు చెల్లిస్తుందని
చెబుతున్నారు. ఒక వేళ దాన్ని ఎవడైనా మొగోడు రుజువు చేస్తే ఒక్క నిమిషంలో సీఎం పదవికి
రాజీనామా చేసి ఇంటికి వెళ్లిపోతాను అని సీఎం కేసీఆర్ సవాల్ విసిరారు. జనగామ
జిల్లాలోని కొడకండ్లలో రైతువేదికను ప్రారంభించిన అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన
సభలో సీఎం కేసీఆర్ మాట్లాడారు. దుబ్బాకలో ఉప ఎన్నిక జరుగుతుంది.అక్కడ బీజేపీ
వాళ్లు గెలిచేది లేదు.. పీకేది లేదు. అక్కడ టీఆర్ఎస్ పార్టీ బ్రహ్మాండంగా ఉంది.
దేశాన్ని పాలిస్తున్న బీజేపీ నాయకులు ఘోరాతి ఘోరమైన అబద్దాలు మాట్లాడుతున్నారు.
మన రాష్ట్రంలో 38 లక్షల
64 వేల 751
మందికి అన్ని రకాల పెన్షన్లు ఇస్తున్నాం. అందరికీ నెల రాగానే పెన్షన్లు
ఇస్తున్నాం. ఈ పెన్షన్లలో కేంద్రం కేవలం 7 లక్షల మందికి మాత్రమే ఇస్తుంది. మనిషికి 200 మాత్రమే
కేంద్రం ఇస్తుంది. సంవత్సరానికి కలిపి కేంద్రం ఇచ్చేది రూ. 105
కోట్లు మాత్రమే. రాష్ట్రం రూ. 10 వేల కోట్ల నుంచి 11 వేల కోట్లు ఇస్తుంది.
బీజేపీ నాయకులు పచ్చి అబద్ధాలు మాట్లాడుతున్నారు. ఈ విషయాలన్నీ ప్రజలందరికీ
తెలియాలి. కాగ్ లెక్క తీసి అధికారికంగా విడుదల చేసింది. తాను చెప్పే లెక్కలన్నీ
కాగ్ వద్ద ఉన్నాయి. ఒక వేళ తాను చెప్పేది అబద్ధమే అయితే, ఎవడన్న
మొగోడు రుజువు చేస్తే తాను ఒక్కటే నిమిషంలో ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసి
ఇంటికి పోతాను. ఓట్ల కోసం ఘోరమైన మోసాలు చేస్తున్నారు. హృదయంలో నిజమైన ప్రేమలేదు..
వారికి ఓట్లు మాత్రమే కావాలి. ఈ మధ్యనే కేంద్రం వ్యవసాయ బిల్లు తెచ్చింది.
గుండాగిరి చేసి బిల్లును ఆమోదింప చేసారు అని సీఎం కేసీఆర్ మండిపడ్డారు.