Advertisement

  • త‌మిళ‌నాడు ప్ర‌భుత్వానికి కృత‌జ్ఞ‌త‌లు తెలిపిన కేసీఆర్

త‌మిళ‌నాడు ప్ర‌భుత్వానికి కృత‌జ్ఞ‌త‌లు తెలిపిన కేసీఆర్

By: chandrasekar Tue, 20 Oct 2020 5:53 PM

త‌మిళ‌నాడు ప్ర‌భుత్వానికి కృత‌జ్ఞ‌త‌లు తెలిపిన కేసీఆర్


ముఖ్య‌మంత్రి కేసీఆర్ తెలంగాణ ప్ర‌భుత్వానికి బాస‌ట‌గా నిలిచిన త‌మిళ‌నాడు స‌ర్కార్‌కు కృత‌జ్ఞ‌త‌లు తెలిపారు.

వ‌ర్షాలు, వ‌ర‌ద‌ల వ‌ల్ల న‌ష్ట‌పోయిన రాష్ట్రానికి రూ. 10 కోట్లు ఆర్థిక సాయం ప్ర‌క‌టించ‌డ‌మే కాకుండా, బ్లాంకెట్లు, చ‌ద్ద‌ర్ల‌తో పాటు ఇత‌ర సామాగ్రి కూడా పంపుతామ‌ని ప్ర‌క‌టించినందుకు త‌మిళ‌నాడు ప్ర‌భుత్వానికి కేసీఆర్ ధ‌న్య‌వాదాలు తెలిపారు.

ఎంతో ఉదారంగా ముందుకు వ‌చ్చినందుకు సీఎం ప‌ళ‌నిస్వామికి, త‌మిళ‌నాడు ప్ర‌జ‌ల‌కు సీఎం కేసీఆర్ కృత‌జ్ఞ‌త‌లు తెలియజేసారు.

భారీ వ‌ర్షాల కార‌ణంగా హైద‌రాబాద్ స‌హా ఇత‌ర జిల్లాల్లో ముంపు బాధితుల‌ను ఆదుకునేందుకు తెలంగాణ ప్ర‌భుత్వం స్పందించిన తీరును సీఎం ప‌ళ‌నిస్వామి ప్ర‌శంసించారు. తెలంగాణ‌కు రూ. 10 కోట్లు ప్ర‌క‌టిస్తూ సీఎం కేసీఆర్‌కు త‌మిళ‌నాడు సీఎం లేఖ రాశారు.

Tags :
|

Advertisement