Advertisement

  • కొండా ల‌క్ష్మ‌ణ్ బాపూజీ 8వ వ‌ర్ధంతి సంద‌ర్భంగా నివాళుల‌ర్పించిన కేసీఆర్

కొండా ల‌క్ష్మ‌ణ్ బాపూజీ 8వ వ‌ర్ధంతి సంద‌ర్భంగా నివాళుల‌ర్పించిన కేసీఆర్

By: chandrasekar Mon, 21 Sept 2020 5:20 PM

కొండా ల‌క్ష్మ‌ణ్ బాపూజీ 8వ వ‌ర్ధంతి సంద‌ర్భంగా నివాళుల‌ర్పించిన కేసీఆర్


స‌్వాతంత్య్ర స‌మ‌ర‌యోధులు కొండా ల‌క్ష్మ‌ణ్ బాపూజీ 8వ వ‌ర్ధంతి సంద‌ర్భంగా ఆయ‌న సేవ‌ల‌ను ముఖ్య‌మంత్రి కెసిఆర్ గుర్తు చేసుకున్నారు. బాపూజీ క్విట్ ఇండియా, ముల్కీ వ్య‌తిరేక ఉద్య‌మంతో పాటు తెలంగాణ ఉద్య‌మంలో ముఖ్య భూమిక పోషించారు అని సీఎం పేర్కొన్నారు.

ల‌క్ష్మ‌ణ్ బాపూజీ అందించిన సేవ‌లు రాబోయే త‌రాల‌కు స్ఫూర్తిదాయ‌క‌మ‌ని సీఎం కేసీఆర్ తెలిపారు. మంత్రులు ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర్‌రావు, నిరంజ‌న్ రెడ్డి కూడా కొండా ల‌క్ష్మ‌ణ్ బాపూజీ చిత్ర‌ప‌టానికి పూల‌మాల వేసి నివాళుల‌ర్పించారు. తెలంగాణ ఉద్య‌మంలో బాపూజీ సేవ‌ల‌ను మంత్రులు గుర్తు చేసుకున్నారు.

Tags :
|

Advertisement