- హోమ్›
- వార్తలు›
- కాకలు తీరిన ప్రాంతీయ పార్టీలు సాధించలేని ఘనతను సాధించిన కేసీఆర్...మోడీ సర్కార్ గుడ్ న్యూస్
కాకలు తీరిన ప్రాంతీయ పార్టీలు సాధించలేని ఘనతను సాధించిన కేసీఆర్...మోడీ సర్కార్ గుడ్ న్యూస్
By: chandrasekar Sat, 10 Oct 2020 4:55 PM
తెలంగాణ ముఖ్యమంత్రి
కె.చంద్రశేఖరరావు నాయకత్వంలోని టీఆర్ఎస్ పార్టీ దేశంలో ఏ ప్రాంతీయ పార్టీ సాధించలేని ఘనతను
దక్కించుకుంది. కరుణానిధి, జయలలిత, చంద్రబాబు వంటి కాకలు తీరిన ప్రాంతీయ పార్టీల నాయకులు
సాధించలేనిది కేసీఆర్ సాధ్యం చేసి చూపించారు. దేశంలో ప్రాంతీయ పార్టీల హవా మొదలై 4
దశాబ్దాలు గడుస్తున్నా ఇప్పటివరకు దేశ రాజధాని ఢిల్లీలో ఏ ఒక్క ప్రాంతీయ పార్టీకీ
కేరాఫ్ ఆఫీసు లేకపోవడం గమనార్హం. ఆయా పార్టీల ఎంపీలకు కేటాయించే ఇళ్లలోనే
ఇన్నాళ్లూ ఆయా పార్టీల రీజనల్ కార్యాలయాలు కొనసాగుతున్నాయి. జాతీయ పార్టీలైన
కాంగ్రెస్, బీజేపీ, సీపీఎం, సీపీఐకి మాత్రమే ఢిల్లీలో ఆఫీసులు ఉండగా, జాతీయ
పార్టీ అని చెప్పుకునే టీడీపీకి గానీ, ఏపీలో 22 మంది ఎంపీలున్న వైసీసీకి గాని, అలాగే
ఢిల్లీలో అధికారంలో ఉన్న ఆమ్ ఆద్మీ పార్టీకి గానీ సొంత కార్యాలయం లేదు. ఈ క్రమంలో
ఢిల్లీలో సొంతగా పార్టీ ఆఫీసు కట్టుకోనున్న తొలి ప్రాంతీయ పార్టీగా టీఆర్ఎస్
అవతరించబోతోంది.
కేసీఆర్కు స్వీట్ న్యూస్
మోదీ సర్కార్ తెలంగాణ రాష్ట్ర సమితి కార్యాలయ భవన నిర్మాణం
కోసం న్యూఢిల్లీలోని వసంత్ విహార్ లో 1,100 చదరపు మీటర్ల స్థలాన్ని కేటాయిస్తూ శుక్రవారం
కేసీఆర్కు స్వీట్ న్యూస్ తెలిపింది. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వ హౌసింగ్, పట్టణ
వ్యవహారాల మంత్రిత్వ శాఖ డిప్యూటీ ల్యాండ్ డెవలప్మెంట్ ఆఫీసర్ దీన్ దయాల్.
టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు, సీఎం కేసీఆర్కు లేఖ రాశారు. పార్టీ కార్యాలయ
నిర్మాణానికి స్థలం కోసం 2018లో ప్రారంభించిన ప్రయత్నాలు ఎట్టకేలకు ఫలించడంతో సీఎం
కేసీఆర్ ఫుల్ హ్యాపీ అయ్యారు. న్యూఢిల్లీ లో టీఆర్ఎస్ ఆఫీసుకు స్థలం కేటాయింపు
ప్రక్రియ ముగిసినందున త్వరలోనే కార్యాలయానికి శంకుస్థాపన జరిపి, త్వరితగతిన
పూర్తి చేయనున్నట్లు సీఎం కేసీఆర్ ప్రకటించారు. ఈ మేరకు టీఆర్ఎస్ అధికారిక ప్రకటన
చేసింది.
ఇక, 2018లో కేసీఆర్ ఢిల్లీలో కార్యాలయ నిర్మాణానికి ప్రయత్నాలు ప్రారంభించినప్పటి
నుంచే చంద్రబాబుతో ఆయన్ను పోల్చుతూ విశ్లేషణలు వెలువడ్డాయి. జాతీయ పార్టీగా
చెప్పుకునే టీడీపీకి కాకుండా, తెలంగాణకే పరిమితమైన టీఆర్ఎస్కు కేంద్ర ప్రభుత్వం
ఆఫీసు స్థలం కేటాయించడం ఆసక్తికర విషయంగా మారింది.