చిన్నారెడ్డి స్వస్థలానికి చేరుకునేందుకు ఏర్పాట్లు చేసిన మాజీ ఎంపీ కవిత
By: chandrasekar Thu, 02 July 2020 7:32 PM
నిజామాబాద్ జిల్లాకు
చెందిన మోపాల్ మండలం బోర్గాం గ్రామానికి చెందిన చిన్నారెడ్డికి గత ఏడాది డిసెంబర్
లో క్యాన్సర్ ఆపరేషన్ జరిగింది. దుబాయ్ లో క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్న
చెన్నారెడ్డికి మాజీ ఎంపీ కల్వకుంట్ల కవిత చేయూత నిచ్చారు. చిన్నారెడ్డి
స్వస్థలానికి చేరుకునేందుకు అవసరమైన ఏర్పాట్లు చేయించారు. ఈ రోజు చిన్నారెడ్డి తన
స్వస్థలం నిజామాబాద్ చేరుకున్నాడు.
మూడు నెలల క్రితం అక్కడ
పని చేసిన సమయంలో కంపెనీ నుంచి తనకు రావాల్సిన డబ్బులు తెచ్చుకోవడానికి దుబాయ్
వెళ్లాడు. అయితే కేవలం 15 రోజులకు సరిపడా మందులు మాత్రమే తీసుకెళ్లిన
చిన్నారెడ్డికి లాక్ డౌన్ రూపంలో కష్టాలు మొదలయ్యాయి. దుబాయ్ లో మందులు దొరక్క, కీమోథెరపీ
జరగక ఇబ్బందులు పడ్డాడు. తనకు ఇండియా
వెళ్లేందుకు సహాయం చేయాల్సిందిగా మాజీ ఎంపీ కవితని మీడియా ద్వారా కోరారు.
మరోవైపు ఇదే విషయమై
కుటుంబ సభ్యుల ద్వారా విషయం తెలుసుకున్న ఎల్లారెడ్డి ఎమ్మెల్యే నల్లమడుగు సురేందర్
కూడా కవితను ఈ విషయమై సంప్రదించారు. దీనిపై వెంటనే మాజీ ఎంపీ కవిత స్పందించారు.
ఆమె సూచనలతో దుబాయ్ లోని ఈటీసీఏ నాయకుడు కిరణ్, చిన్నారెడ్డికి సహాయసహకారాలు అందించారు.
ఫ్లైట్ టికెట్ కూడా కన్
ఫర్మ్ చేయించారు. దీంతో బుధవారం చిన్నారెడ్డి శంషాబాద్ చేరుకున్నాడు. శంషాబాద్
ఎయిర్ పోర్ట్ లో చిన్నారెడ్డిని కలిసిన తెలంగాణ జాగృతి రాష్ట్ర నాయకులు నవీన్
ఆచారి, కవిత
సూచనల మేరకు స్వగ్రామం వెళ్లేందుకు ఏర్పాట్లు చేశారు. అడిగిన వెంటనే స్పందించి
సహకరించిన చిన్నారెడ్డి కుటుంబ సభ్యులు మాజీ ఎంపీ కవితకు కృతజ్ఞతలు తెలియ చేశారు.