రాముడి మీద అనుచిత వ్యాఖ్యలు చేసిన కత్తి మహేష్ ..
By: Sankar Fri, 14 Aug 2020 3:36 PM
సినీ క్రిటిక్ కత్తి మహేష్ మరొకసారి రాముడు మీద వివాదాస్పద వాఖ్యలు చేసాడు ..ఇప్పటికే ఒకసారి రాముడి మీద అనుచిత వ్యాఖ్యలు చేసి ఇబ్బందుల పాలు అయిన కత్తి మహేష్ మరొకసారి అలాంటి వాక్యాలతోనే ఇబ్బంది పడ్డాడు..కత్తి మహేష్ తన ఫేస్ బుక్లో ‘రాముడు కరోనా ప్రియుడు’ అంటూ పోస్ట్ పెట్టడంతో పోలీసులకు ఫిర్యాదులు అందాయి. వీటిపై స్పందించిన పోలీసులు కత్తి మహేష్పై ఐపీసీ సెక్షన్ 154 కమ్యూనల్ యాక్ట్ కింద కేసు నమోదు చేశారు.
2018లో రాముడుపై ఇలాంటి వ్యాఖ్యలే చేయడంతో.. నగర బహిష్కరణ చేశారు. పోలీసుల అనుమతి లేకుండా అతడు హైదరాబాద్ నగరానికి రాకూడదని ఆదేశాలు జారీచేశారు. పలు హిందూ ధార్మిక సంఘాలు నిరసన వ్యక్తం చేయడంతో పాటు.. శ్రీరాముడిపై కత్తి మహేశ్ అనుచిత వ్యాఖ్యలను నిరసిస్తూ శ్రీపీఠాధిపతి స్వామి పరిపూర్ణానంద స్వామి ధర్మాగ్రహ యాత్ర పేరుతో పాదయాత్రను చేపట్టారు.
అయితే అప్పట్లో పరిపూర్ణానంద పాదయాత్రకు పోలీసులు అనుమతి నిరాకరించారు. అయితే ఇంత వివాదం రేగినా.. మళ్లీ కత్తి మహేష్ హిందువులు మనోభావాలు దెబ్బతినేలా రాముడు కరోనా ప్రియుడు అంటూ అనుచిత వ్యాఖ్యలు చేయడం వివాదాస్పదంగా మారింది.