రాత్రిపూట కర్ఫ్యూ ఆదేశాలను ఉపసంహరించుకున్న కర్ణాటక
By: Sankar Thu, 24 Dec 2020 6:33 PM
బ్రిటన్లో విజృంబిస్తున్న కొత్త వైరస్ స్ట్రెయిన్ కారణంగా ఇండియాలో అన్ని రాష్ట్రాలు అప్రమత్తం అయ్యాయి..ఇప్పటికే బ్రిటన్ నుంచి వచ్చే విమానాలపై నిషేధం విధించారు...ఇక కరోనా ఎక్కువగా మహారాష్ట్ర , కర్ణాటక వంటి రాష్ట్రాలు రాత్రి పూట కర్ఫ్యూ ప్రకటించాయి..
అయితే కర్ణాటక ప్రభుత్వం ఒక్క రోజులోనే రాత్రి పూట కర్ఫ్యూపై యూటర్న్ తీసుకుంది. దీనికి సంబంధించిన ఆదేశాలను గురువారం ఉపసంహరించుకుంది. పరిస్థితిని సమీక్షించిన తర్వాత టెక్నికల్ అడ్వైజరీ కమిటీ సూచన మేరకు రాత్రి పూట కర్ఫ్యూ ఆదేశాలను ఉపసంహరించుకున్నట్లు ముఖ్యమంత్రి కార్యాలయం ప్రకటించింది.
ప్రతి రోజూ రాత్రి 11 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకూ కర్ఫ్యూ ఉంటుందని బుధవారం విడుదల చేసిన ఆదేశాల్లో ప్రభుత్వం పేర్కొన్నది. అయితే దానిని అమలు చేయడానికి కొన్ని గంటల ముందే ఆ ఆదేశాలను వెనక్కి తీసుకోవడం గమనార్హం.