దీపావళి పటాసులపై నిషేధాన్ని ఎత్తివేసిన కర్ణాటక సర్కార్
By: Sankar Sun, 08 Nov 2020 07:16 AM
దీపావళి పటాకుల నిషేధంపై కర్ణాటక సర్కార్ వెనక్కి తగ్గింది.. క్రాకర్స్పై బ్యాన్ విధిస్తున్నట్లు ప్రకటించిన 8 గంటలకే... నిబంధనలు మార్చింది. పర్యావరణకు హాని కలిగించనివి కాల్చుకోవచ్చని సూచించింది.
కరోనా కేసులు పెరుగుతున్న కారణంగా... ప్రజలు జాగ్రత్తలు తీసుకుంటూ పండగ జరుపుకోవాలని సూచించింది. కరోనా నియంత్రణకు ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందని, ప్రజలు సహకరించాలని విజ్ఞప్తి చేసింది కర్ణాటక ప్రభుత్వం. కాగా.. కరోనా కేసులు తగ్గుముఖం పట్టినా.. ప్రస్తుతం దేశంలో చలి పంజా విసురుతోంది. చలి తీవ్రత పెరిగిపోతుండటంతో కేసులు పెరిగే అవకాశం ఉన్నట్టు నిపుణులు హెచ్చరిస్తున్నారు.
ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. ఇక దేశంలో అతి ముఖ్యమైన, పెద్దవైన పండగల్లో దీపావళి కూడా ఒకటి. కాగా.. దీపావళి సందర్భంగా కాల్చే టపాసులపై కూడా దృష్టిసారించాయి ప్రభుత్వాలు.. ఢిల్లీ పరిధిలో కూడా టపాసులు కల్చరాదని సర్కార్ స్పష్టం చేసిన సంగతి తెలిసిందే..