Advertisement

  • కర్ణాటక శాసన మండలి డిప్యూటీ చైర్మన్ ఆత్మహత్య....

కర్ణాటక శాసన మండలి డిప్యూటీ చైర్మన్ ఆత్మహత్య....

By: Sankar Tue, 29 Dec 2020 09:03 AM

కర్ణాటక శాసన మండలి డిప్యూటీ చైర్మన్ ఆత్మహత్య....


కర్ణాటకా శాసన మండలి డిప్యూటీ చైర్మన్ ఎస్ఎల్ ధర్మేగౌడ ఆత్మహత్య చేసుకున్నారు. నేడు ఉదయం ఆయన మృతదేహం రైలుపట్టాలపు కనిపించడంతో స్థానికులు ఆందోళన చెందారు. దాంతో పోలీసులకు కబురు పెట్టగా పోలీసుల వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారు.

ఈ ఘటన కర్ణాటకలోని చిక్కమాగలూరులో కాడూర్ వద్ద చోటుచేసుకుంది. పోలీసులు విచారణ మొదలు పెట్టారు. వారు ఓ సూసైడ్ నోట్‌ను రికవరీ చేశారు. అయితే పోలీసులు తమ తదుపరి విచారణను కొనసాగించనున్నారు. మరి వివరాల కోసం ఇతర శాఖల వారు ఘటనా స్తలాన్ని పరిశీలిస్తున్నారు.

ఇప్పటి వరకు అతడు ఆత్మహత్యకు ఎందుకు పాలుపడ్డాడనే విషయం తేలియలేదు. ఈ ఘటనను పోలీసులు అనేక కోణాల్లో విచారిస్తున్నారు. మరిన్ని వివరాల కోసం వేచి చూడాల్సిందే.

Tags :

Advertisement